E-Paper
Advertisement

kothagudem : మిగ్‌జాం తుఫాన్.. జలమయమైన ప్రాంతంలో పర్యటించిన జిల్లా కలెక్టర్..

kothagudem : మిగ్‌జాం తుఫాన్.. జలమయమైన ప్రాంతంలో పర్యటించిన జిల్లా కలెక్టర్..
Advertisement

kothagudem : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా మిగ్‌జాం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ములకలపల్లి, దమ్మపేట, అశ్వరావుపేట మండలాల్లో తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను ఆమె పర్యటించి అధికారుల నుండి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ప్రియాంక ఆలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వెంటనే తుఫాన్ బాధిత ప్రాంతాల్లో పర్యటించి జరిగిన ఆస్తి నష్టం, పంట నష్టం వివరాలు అంచనా వేసి తనకు రిపోర్ట్ అందజేయాలని అధికారులను ఆదేశించారు.

అలానే దమ్మపేట మండలంలో భారీ వర్షం కారణంగా మండల కేంద్రంలోని పేరంటాల చెరువు కాలువ తెగి వరదనీరు పంట పొలాలపై నుంచి పారుతుండటంతో ఆ ప్రాంతాన్ని ప్రియాంక ఆలా సందర్శించారు. అలానే పట్వారి గూడెం గ్రామంలో దెబ్బతిన్న వరి,శనగ, మొక్కజొన్న, పంటను ఆమె పరిశీలించారు. అశ్వరావుపేట మండలం ఉట్లపల్లి గ్రామంలో తుఫాన్ దాటికి నేలకొరిగిన ఇంటిని ఆమె పరిశీలించారు. తక్షణమే వారికి సహాయం అందించాలని స్థానిక అధికారులను ఆదేశించారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×