E-Paper
Advertisement

Medigadda : మేడిగడ్డలో కాపర్ డ్యాం పనులు షురూ.. సీఎం చొరవతో కదిలిన L&T

Medigadda : మేడిగడ్డలో కాపర్ డ్యాం పనులు షురూ.. సీఎం చొరవతో కదిలిన L&T
Advertisement
telangana news live

Medigadda barrage news(Telangana news live):

కాంగ్రెస్ సర్కారు రంగంలోకి దిగడంతో మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులు ప్రారంభం అయ్యాయి. అంతకు ముందు ఒప్పందం గడువు ముగియడంతో.. మరమ్మతులు చేయబోమని ఎల్ అండ్ టీ నిర్మాణ సంస్థ బుకాయించింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగడంతో బ్యారేజీకి మరమ్మతు పనులు మొదలయ్యాయి.

ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజీకి ఎడమ వైపు మహారాష్ట్ర నుంచి కాఫర్ డ్యాం నిర్మించేందుకు ఎల్అండ్ టీ సంస్థ మట్టి పనులు చేపట్టింది. బ్యారేజీలో కుంగిన 7వ బ్లాక్ ఉన్న వైపు నుంచే ముందుగా పనులు మొదలుపెట్టారు. కాగా మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనుల్లో కదిలిక రావడంతో మళ్లీ కాళేశ్వరం నీళ్లపై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

Advertisement

మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ లో 21వ పిల్లరు అక్టోబరు 21న కుంగిపోయింది. కుంగుబాటుకు గల కారణాలు తెలుసుకొని పునరుద్ధరిస్తామని ఎల్ అండ్ టీ సంస్థ ప్రకటించింది. గత ప్రభుత్వం లోని మంత్రులు, ఇంజనీరింగ్ అధికారులు కూడా నిర్మాణ సంస్థే పూర్తి బాధ్యత వహించి బ్యారేజీ పునరుద్ధరణ పనులు చేపడుతుందని ప్రకటించారు. అయితే ఈ నెల 2న ఎల్ అండ్ టీ కంపెనీ పునరుద్ధరణ పనులపై మాట మార్చింది. బ్యారేజీ నిర్మాణం సమయంలో కుదుర్చుకున్న డిఫెన్స్ లయబిలిటీ పీరియడ్ రెండేళ్ల వరకే ఉందని.. 2022 జూన్ 29తోనే ఒప్పందం ముగిసిపోయిందని ప్రకటించింది. మళ్లీ పునరుద్ధరణ పనులు చేయాలంటే కొత్తగా ఒప్పందం చేసుకోవాలని లేఖ రాసింది. అంతేగాక కాఫర్ డ్యాం నిర్మాణానికి రూ.55.75 కోట్లు కావాలని పేర్కొంది.

దీంతో సీఎం రంగంలోకి దిగి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఎల్ అండ్ టీ ప్రతినిధులతో కూడా సమావేశమై.. పనులు పూర్తి కాకుండా బాధ్యతల నుంచి ఎలా తప్పించుకుంటారని ప్రశ్నించారు. తప్పుచేసి తప్పించుకోవాలని చూస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. దాంతో ఈ సమీక్ష జరిగిన మూడు రోజుల తర్వాత ఎల్అండ్ టీ సంస్థ బ్యారేజీ వద్ద కాఫర్ డ్యాం పనులను మళ్ళీ మొదలుపెట్టింది.

Advertisement

ఈ పనులు పూర్తయిన తర్వాత అన్ని బ్లాకుల్లో పిల్లర్ల పరిస్థితిని అంచనా వేసేందుకు నిపుణులతో పరిశీలన చేయనున్నారు. కేవలం 7వ బ్లాక్ వరకే కుంగుబాటు పరిమితమైతే ఇక్కడే పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు. నిపుణులు మాత్రం 18, 19, 20, 21, 22 పిల్లర్లపైనా కుంగుబాటు ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తం 7వ బ్లాక్ నే పునరుద్ధరించాల్సి వస్తే సుమారు రూ.600 కోట్ల వరకు ఖర్చు వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×