E-Paper
Advertisement

CM Revanth Reddy: పేదవాడి పళ్లెంలో సన్న బియ్యం.. దేశంలోనే తెలంగాణ ఆదర్శం

CM Revanth Reddy: పేదవాడి పళ్లెంలో సన్న బియ్యం.. దేశంలోనే తెలంగాణ ఆదర్శం
Advertisement

CM Revanth Reddy: ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆదిలాబాద్ గడ్డకు ఉన్న పోరాట చరిత్రను, అమాయక గిరిజన బిడ్డల ఆత్మగౌరవాన్ని కొనియాడుతూనే, గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల వెనుకబడిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. ఈ సభలో సుమారు రూ. 1250 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

ఉపముఖ్యమంత్రి పాదయాత్ర స్ఫూర్తి..

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేపట్టిన ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్ర ఈ పిప్రి ప్రాంతం నుంచే ప్రారంభమైందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. 1400 కిలోమీటర్ల మేర సాగిన ఆ యాత్రలో గూడెం గూడెం తిరిగి, ప్రజల కష్టాలను స్వయంగా చూశామని చెప్పారు. అందుకే తాము అధికారంలోకి రాగానే తమ ప్రత్యేక దృష్టిని ఆదిలాబాద్‌పై ఉంచామని తెలిపారు. కొమరం భీమ్, రాంజీ గోండు వంటి వీరులు పుట్టిన ఈ గడ్డపై నిరంకుశ పాలనకు తావులేదని, జల్-జమీన్-జంగిల్ నినాదంతో సాగిన పోరాట స్ఫూర్తితోనే తాము ప్రజాపాలన సాగిస్తున్నామని పేర్కొన్నారు.

కేవలం ఎన్నికల వరకే రాజ‌కీయాలు..

Advertisement

రాజకీయాలు కేవలం ఎన్నికల వరకే ఉండాలని, ఎన్నికల తర్వాత అభివృద్ధిలో అందరూ కలిసి నడవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ వేదికపై ఉన్న ప్రతిపక్ష ఎమ్మెల్యేలను గౌరవించడం ద్వారా తాము సరికొత్త రాజకీయ సంస్కృతికి తెరలేపామని చెప్పారు. గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలను అరెస్టులు చేసేవారని, కానీ తమ పాలనలో అందరినీ పిలిచి మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్నామని తెలిపారు. “నిర్మల్ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే లేకపోయినా, అక్కడి ప్రజలు మా బిడ్డలే.” అని పేర్కొంటూ నిర్మల్‌కు కూడా రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

సంక్షేమ పథకాలు.. సన్న బియ్యం విప్లవం..

తమ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల గురించి సీఎం వివరించారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం రూ. 10 వేల కోట్లు ఖర్చు చేశామని, ఇది ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచిందని చెప్పారు. గతంలో పేదలకు దొడ్డు బియ్యం ఇచ్చేవారని, కానీ ఇప్పుడు తెలంగాణలోని 3 కోట్ల 15 లక్షల మందికి దేశంలోనే మొదటిసారిగా సన్న బియ్యం అందిస్తున్నామని గర్వంగా ప్రకటించారు. నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున, ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల సాయం అందిస్తున్నామని, ఐటీడీఏ పరిధిలో అదనంగా 25 వేల ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని తెలిపారు.

సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తా..

Advertisement

ఆదిలాబాద్‌లో 60 శాతం అటవీ ప్రాంతం ఉన్నప్పటికీ, ఇక్కడ వ్యవసాయం, పరిశ్రమలు ఆశించిన స్థాయిలో విస్తరించలేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలోని జలవనరులను ఉపయోగించుకుని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, ఆదిలాబాద్‌ను పాలమూరుతో సమానంగా అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చారు. ఐటీడీఏ ప్రాంతాల్లోని గూడాల పటేళ్లకు ఇచ్చిన మాట ప్రకారం, గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్య సౌకర్యాలను మెరుగుపరుస్తామని చెప్పారు.

జిల్లాల సరిహద్దుల మార్పులపై స్పష్టత..

కొత్త మండలాలు లేదా రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వ నిబంధనల వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయని సీఎం వివరించారు. 2027 మార్చి 31 వరకు జిల్లాల సరిహద్దులు మార్చవద్దని కేంద్రం ఆదేశాలు ఉన్నాయని, అయినప్పటికీ నిబంధనలకు లోబడి ప్రజా అవసరాలను తీరుస్తామని తెలిపారు. తన ప్రభుత్వం అదానీ, అంబానీల కోసం కాదని, పేదవాడి ఆత్మగౌరవం కోసం పనిచేస్తుందని స్పష్టం చేస్తూ, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని కోరారు.

Read Also: రేపు కర్రెగుట్టలకు డీజీపీ శివధర్ రెడ్డి.. గుత్తికొయ్యలతో ముఖాముఖి, కారణం అదేనా?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×