E-Paper
Advertisement

ఇకపై ఆలయాల్లో అవి ఉండకూడదు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

ఇకపై ఆలయాల్లో అవి ఉండకూడదు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
Advertisement

Basara Temple: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో ప్ర‌ముఖ ఆల‌యాల‌ ప‌రిస‌రాల్లో తిరుమ‌ల త‌ర‌హాలో నిబంధ‌న‌లు అమ‌లు చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాజ‌కీయ పార్టీల స‌భ‌లు, జెండాలు, ప్ర‌ద‌ర్శ‌నలు లేకుండా ఆధ్యాత్మికత‌కు పెద్దపీట వేయాల‌ని సీఎం సూచించారు. బాస‌ర జ్ఞాన స‌ర‌స్వ‌తి దేవాల‌య అభివృద్ధి ప‌నుల‌పై ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి శ‌నివారం స‌మీక్ష నిర్వ‌హించారు. తొలుత బాసర ఆలయ అభివృద్ధికి సంబంధిచిన మాస్టర్ ప్లాన్ ను అధికారులు ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జంటేష‌న్ ద్వారా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి వివ‌రించారు. ఆల‌య అభివృద్ధి ప‌నుల‌కు రూ.225 కోట్ల వ్య‌య‌మ‌వుతుంద‌ని అధికారులు తెలియ‌జేశారు.

సీఎం ఆదేశం..

మాస్ట‌ర్‌ప్లాన్‌ను ప‌రిశీలించిన సీఎం ప‌లు మార్పులు సూచించారు. సోమవారం సీఎం బాసరకు వెళ్లనున్నారు. టెంపుల్స్ డెవలప్ మెంట్ కు పలు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇక సంప్ర‌దాయాలు, శాస్త్రాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని భ‌క్తుల విశ్వాసాల‌కు పెద్ద‌పీట వేస్తూ బాస‌ర ఆల‌య అభివృద్ధి ప‌నులు చేప‌ట్టాల‌ని సీఎం సూచించారు. భ‌విష్య‌త్ అవ‌స‌రాలు, భ‌క్తుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకొని విశాల‌మైన రోడ్లు నిర్మించాల‌ని సీఎం ఆదేశించారు. ఆల‌య ప్రాంగణం భ‌విష్య‌త్‌లో భారీ వృక్షాల‌తో అల‌రారేలా అవ‌స‌ర‌మైన మొక్క‌లు నాటాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

Advertisement

Also Read: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పై బీఆర్ఎస్ జెండా!

అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌లు

ఆల‌యం స‌మీపంలో హెల్త్ సెంట‌ర్ నిర్మించాల‌ని పుష్క‌రాలు, ఇత‌ర ఉత్స‌వాల రోజుల్లో అక్క‌డ త‌గిన సంఖ్య‌లో వైద్యులు, వైద్య సిబ్బంది ఉండి భ‌క్తుల‌కు సేవ‌లు అందించేందుకు అనువుగా దానిని నిర్మించాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు. ఎంత‌టి ప్ర‌ముఖుల వాహ‌నాలైనా ఆల‌య ప్రాంగ‌ణానికి బ‌య‌టే నిలిచిపోవాల‌ని ఆల‌య ప్రాంగ‌ణంలోకి కేవ‌లం ఎల‌క్ట్రిక్ వాహ‌నాల (ఈవీ) ద్వారానే చేరుకునేలా చూడాల‌ని సీఎం ఆదేశించారు. ఇందుకు అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని సీఎం సూచించారు. వాహ‌నాల పార్కింగ్ ప్ర‌దేశంలో సోలార్ రూప్‌టాప్ ఏర్పాటు చేయాల‌న్నారు.

అభివృద్ది ప‌నులు

Advertisement

అభివృద్ధి ప‌నుల స‌మ‌యంలో ఆల‌య ప‌విత్ర‌త‌కు ఎటువంటి భంగం కల‌గ‌కుండా జాగ్ర‌త్త ప‌డాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. అభివృద్ది ప‌నుల నాణ్య‌త‌లో రాజీప‌డితే ఏమాత్రం స‌హించేది లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చ‌రించారు. స‌మీక్ష‌లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ‌, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Also read: BRS : కేసీఆర్ గుర్తులు ప్రజలకు ఇంకా గుర్తున్నాయా?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×