E-Paper
Advertisement

CM Revanth Reddy: సీఎం అవుతానని ఆనాడే తెలిసింది.. సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: సీఎం అవుతానని ఆనాడే తెలిసింది.. సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy: పీసీసీ అధ్యక్షుడిగా వచ్చాను. మళ్లీ సీఎం హోదాలో ఇక్కడికి వచ్చానంటూ సీఎం రేవంత్ రెడ్డి మెదక్ పర్యటన సమయంలో అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని మెదక్ చర్చి వద్ద ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

మెదక్ చర్చి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను బుధవారం నిర్వహించారు. అలాగే క్రిస్మస్ పర్వదినాన్ని సైతం ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాల నిర్వహించగా క్రైస్తవ సోదర సోదరీమణులు పెద్ద ఎత్తున చర్చికి తరలి వచ్చారు. చర్చి శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందించగా, బుధవారం సీఎం క్రిస్మస్ పర్వదినాన పురస్కరించుకొని మెదక్ చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు.

Advertisement

మెదక్ చర్చికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి పాస్టర్లు, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మెదక్ చర్చితో తనకు గొప్ప అనుబంధం ఉందన్నారు. పిసిసి అధ్యక్షుడి హోదాలో తాను మెదక్ చర్చికి వచ్చి ఆశీస్సులు తీసుకున్నానని, మళ్లీ సీఎం హోదాలో ఇక్కడికి వస్తానంటూ ఆనాడే చెప్పానని తన మాటలను సీఎం గుర్తుకు చేసుకున్నారు. ప్రభువు ఆశీస్సులతో తెలంగాణలో ప్రజా ప్రభుత్వం వచ్చిందని, శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం తనకు దక్కిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు సీఎం తెలిపారు.

Also Read: Allu Arjun : నేషనల్ మీడియాను మిస్ చేయడం లేదు… ఈ పొజిషన్‌లో కూడా పబ్లిసిటీ అవసరమా..?

Advertisement

మెదక్ చర్చి అభివృద్ధికి అవసరమైన నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేసిందని, అన్ని వర్గాల ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో పాలన సాగిస్తుందని సీఎం అన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులను, ఎమ్మెల్యేలను ఘనంగా సన్మానించారు. అలాగే మెమొంటోలను సైతం అందజేశారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×