E-Paper
Advertisement

CM Revanth Reddy: గుర్తింపు ఎక్కడ.. సీఎం రేవంత్‌రెడ్డి అసంతృప్తి.. ప్రధానికి లేఖ?

CM Revanth Reddy: గుర్తింపు ఎక్కడ.. సీఎం రేవంత్‌రెడ్డి అసంతృప్తి.. ప్రధానికి లేఖ?
Advertisement

CM Revanth Reddy: ప‌ద్మ అవార్డులపై ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాయాలని నిర్ణయించు కున్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రముఖుల పేర్లను కేంద్రం పరిగణనలోకి తీసుకోకపోవడం అసహనం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ నాలుగు కోట్ల తెలంగాణ ప్ర‌జ‌ల‌ను అవ‌మానించ‌డ‌మేన‌ని మనసులోని ఆవేదనను బయటపెట్టారు.

గ‌ద్ద‌ర్ (ప‌ద్మ‌విభూష‌ణ్‌), చుక్కా రామ‌య్య (ప‌ద్మ‌భూష‌ణ్‌), అందెశ్రీ (ప‌ద్మ‌భూష‌ణ్‌), గోర‌టి వెంక‌న్న (ప‌ద్మ‌శ్రీ‌), జ‌య‌ధీర్ తిరుమ‌ల‌రావు (ప‌ద్మ‌శ్రీ‌) ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది రాష్ట్రప్రభుత్వం. మంత్రులు, అధికారుల‌తో జ‌రిగిన స‌మావేశంలో ఈ అంశంపై ముఖ్య‌మంత్రి రేవంత్ మాట్లాడారు.

Advertisement

తెలంగాణ‌కు ప‌ద్మ పుర‌స్కారాల్లో ముమ్మాటికీ అన్యాయమే జరిగిందన్నారు సీఎం. తెలంగాణ స‌మాజానికి వివిధ రంగాల్లో విశిష్ట సేవ‌లు అందించిన గ‌ద్ద‌ర్‌, చుక్కా రామ‌య్య‌, అందెశ్రీ‌, గోర‌టి వెంక‌న్నల‌ను గుర్తించ‌క‌పోవ‌డం దారుణమన్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వానికి భంగం క‌లిగించడ‌మేన‌ని పేర్కొన్నారు.

139 మందికి పుర‌స్కారాలు ప్ర‌క‌టించింది కేంద్ర ప్ర‌భుత్వం. తెలంగాణ‌కు క‌నీసం అయిదు పుర‌స్కారాలు ప్ర‌కటించ‌లేదు. తెలంగాణ నుంచి ఇద్దరికి మాత్రమే పద్మ అవార్డులు వచ్చాయి. వైద్య రంగంలో నాగేశ్వర్‌రెడ్డికి పద్మ విభూషణ్‌, ప్రజా వ్యవహారాల్లో మంద కృష్ణ మాదిగకు పద్మశ్రీ పురస్కారాలు వరించాయి.

Advertisement

ALSO READ:  గణతంత్ర దినోత్సవం.. రాష్ట్ర ప్రజలకు సీఎం మాట

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×