E-Paper
Advertisement

Indravelli Sabha : సీఎం హోదాలో ఇంద్రవెల్లికి రేవంత్ రెడ్డి.. పార్లమెంట్ ఎన్నికలకు శంఖారావం

Indravelli Sabha : సీఎం హోదాలో ఇంద్రవెల్లికి రేవంత్ రెడ్డి.. పార్లమెంట్ ఎన్నికలకు శంఖారావం
Advertisement

cm revanth reddy indravelli sabha

Indravelli Sabha(Political news in telangana): సీఎం రేవంత్‌రెడ్డి పొలిటికల్‌ సెంటిమెంట్‌ ప్లేస్‌ అయిన ఇంద్రవెల్లికి తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ఇవాళ వెళ్లనున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్‌ పగ్గాలు చేతపట్టాక మొదటిసారిగా ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద భారీ బహిరంగ నిర్వహించారు. ఆ సభ విజయవంతం కావడం, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో ఆదిలాబాద్‌ టూర్‌ రేవంత్‌కు కలిసొచ్చింది. అందుకే ఇదే సెంటిమెంట్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో తొలి పర్యటనకు ఇంద్రవెల్లి వెళ్లునున్నారు రేవంత్‌రెడ్డి. ఇంద్రవెల్లి వేదికగా పార్లమెంట్ ఎన్నికలకు శంఖారావం పూరించనున్నారు రేవంత్. అలాగే కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీంలలో రెండింటిని ఇదే వేదిక నుంచి ప్రారంభించనున్నారు.

Advertisement

సీఎం రేవంత్‌రెడ్డి మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి ఇంద్రవెల్లికి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆసిఫాబాద్‌కు బయలుదేరుతారు. అక్కడ కేస్లాపూర్‌ నాగోబా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఇంద్రవెల్లికి చేరుకుని కొమురం భీం స్మృతి వనానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం తెలంగాణ పునర్ నిర్మాణ సభలో పాల్గొంటారు. ఈ సభా వేదిక నుంచే పార్లమెంట్‌ ఎన్నికల శంఖారావం పూరించడంతోపాటు.. ఎన్నికల హామీలైన ఆరు గ్యారెంటీల్లోని రెండు గ్యారెంటీ పథకాలను ప్రారంభిస్తారు. రూ.500 గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామని, గృహజ్యోతి పథకం పేరుతో 200ల యూనిట్ల ఉచిత్‌ విద్యుత్‌ అందిస్తామని ఎలక్షన్‌ టైమ్ లో చెప్పిన మాటను నిలబెట్టుకోనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇక సీఎం పర్యటన సందర్భంగా ఆంక్షలు విధించారు పోలీసులు. నాగోబా ఆలయం, సభా ప్రాంగణం వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. రేవంత్‌ టూర్‌ను విజయవంతం చేసే దిశగా కాంగ్రెస్‌ శ్రేణులు జనసమీకరణపై ఫోకస్‌ పెట్టారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×