E-Paper
Advertisement

CM Revanth Reddy Casts Vote: కొడంగల్‌లో ఓటేసిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు..!

CM Revanth Reddy Casts Vote: కొడంగల్‌లో ఓటేసిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు..!
Advertisement

Telangana CM Revanth Reddy Casts Vote In Kodangal: లోక్ సభ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు అతని భార్య, కూతురు ఓటేశారు. కొడంగల్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, కూతురు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 33.5 శాతం ఓట్లు వచ్చాయని., ఈ ఎన్నికల్లో అంతకు మించి వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఓటు వేసిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ ఎన్నికలు మా వంద రోజుల పాలనకు రెఫరెండం అన్నారు. దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖయమని సీఎం అన్నారు. దేశంలో అబ్ కీ బార్ 400 అంటున్నారు.. 336 సీట్లలో పోటీ చేసిన బీజేపీకి 400 సీట్లు ఎలా సాధ్యం అని ప్రశ్నించారు. 13 ఏళ్లు సీఎంగా , 10ఏళ్లు పీఎంగా పని చేసిన మోదీ.. భారత రాజ్యాంగాన్ని పూర్తిగా అర్ధం చేసుకోలేదని అన్నారు.

Advertisement

దేశంలోమ మోదీ వ్యతిరేక వేవ్ నడుస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇండియా కూటమి పేరుతో ప్రజలను తాము ఓట్లు అడుగుతుంటే బీజేపీ మాత్రం మోదీ పేరుతో ఓట్లు అడుగుతోందని చెప్పారు. కాంగ్రెస్ కు ఆదాని, అంబానీ డబ్బులు ఇస్తున్నారన్న మోదీని ప్రశ్నించారు సీఎం. ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులను పంపి ఆదానీ, అంబానీల ఆఫీసులపై, ఇళ్లల్లో సోదాలు ఎందుకు నిర్వహించడంలేదని ప్రశ్నించారు. రైతు బంధు ఎలా ఇచ్చామో.. ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు.

Also Read: Voters: హైదరాబాద్ బాట పట్టిన ఓటర్లు.. రహదారుల్లో వాహనాల రద్దీ

Advertisement

కేసీఆర్ పై తనకు సానుభూతి ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మానసిక ఒత్తిడితో, నిరాశతో భావోద్వేగంతో ఆయన ప్రకటనలు చేస్తున్నారన్నారు సీఎం. కేసీఆర్ కూడా కేఏ పాల్ లాగా మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×