E-Paper
Advertisement

CM Revanth Reddy: ఢిల్లీలో బిజీగా సీఎం రేవంత్.. కాసేపట్లో రాహుల్‌గాంధీతో భేటీ, పార్టీ ముఖ్యనేతలతో..

CM Revanth Reddy: ఢిల్లీలో బిజీగా సీఎం రేవంత్.. కాసేపట్లో రాహుల్‌గాంధీతో భేటీ, పార్టీ ముఖ్యనేతలతో..
Advertisement

CM Revanth Reddy: తెలంగాణలో జరుగుతున్న రాజకీయాలపై పార్టీ పెద్దలతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించారు. పార్టీ పటిష్టతకు కొన్ని సలహాలు, సూచనలు చేశారు. మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. తొలుత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ భేటీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హారయ్యారు.

ఢిల్లీలో బిజీగా సీఎం రేవంత్.. పార్టీ ముఖ్యనేతలతో భేటీ

Advertisement

బుధవారం ఉదయం పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి. ఆ తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ, సీనియర్ నేత జీవన్‌రెడ్డి వ్యవహారంపై చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  యువనేతతో సమావేశం తర్వాత హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.

తాజాగా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేంనరేందర్ రెడ్డి.. ఖర్గే నుంచి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డిని అభినందించారు ఖర్గే. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. నాయకులందరూ కలిసి ప్రస్తుత రాజకీయాలు, తెలంగాణలో పార్టీ స్థితిగతులు, భవిష్యత్ వ్యూహాలపై చర్చించారు.

Advertisement

రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ

కాంగ్రెస్ పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు వంటి అంశాలపై చర్చ జరిగింది. రాబోయే రాజకీయ సవాళ్లను ఏ విధంగా ఎదుర్కొవాలి అనేదానిపై పార్టీ చీఫ్ పలు సూచనలు చేశారు. ఆ సమావేశంలో ఎంపీలు మల్లు రవి, సురేష్ షెట్కర్, బలరాం నాయక్ పాల్గొన్నారు.

అంతకుముందు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇరువురు నేతలు వివిధ అంశాలపై చర్చించినట్టు ఢిల్లీ పొలిటికల్ వర్గాల సమాచారం. కేరళలో పార్టీ గెలుపుపై చర్చించినట్టు తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం నాటికి ఢిల్లీ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి టీమ్ హైదరాబాద్‌కు రానుంది.

ALSO READ: కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన జీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ పార్టీలో కీలక పోస్ట్..?

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×