E-Paper
Advertisement

Cm Revanth Reddy: నా ప్ర‌జ‌ల‌ను ఇబ్బంది పెట్ట‌ను.. అది ఫార్మాసిటీ కాదు ఇండ‌స్ట్రియ‌ల్ పార్క్.. వామ‌ప‌క్ష నేత‌ల‌తో సీఎం

Cm Revanth Reddy: నా ప్ర‌జ‌ల‌ను ఇబ్బంది పెట్ట‌ను.. అది ఫార్మాసిటీ కాదు ఇండ‌స్ట్రియ‌ల్ పార్క్.. వామ‌ప‌క్ష నేత‌ల‌తో సీఎం
Advertisement

Cm Revanth Reddy: ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న నేప‌థ్యంలో క‌మ్యూనిస్టు పార్టీల నేత‌లు సీఎం రేవంత్ రెడ్డితో స‌చివాల‌యంలో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ల‌గ‌చ‌ర్లలో తాము ప‌ర్య‌టించి ప‌రిశీలించిన విష‌యాల‌ను సీఎం దృష్టికి తీసుకునివెళ్లారు. అక్క‌డ రెండు పంట‌లు పండే భూములు ఉన్నాయ‌ని సీఎంకు చెప్పారు. రైతుల‌ను ఇబ్బంది పెట్ట‌వ‌ద్ద‌ని అన్నారు. రైతుల త‌ర‌ఫున విన‌తీప‌త్రాన్ని అంద‌జేశారు. దీంతో సొంత నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌ను నేనే ఎందుకు ఇబ్బంది పెడ‌తాన‌ని సీఎం వారితో చెప్పారు.

Also read: షిండే, అజిత్ పవార్‌ల వెంటే మహా ప్రజలు.. పార్టీలను చీల్చినా ఎందుకింత క్రేజ్

Advertisement

కొడంగల్ ఓ ఏర్పాటు చేసేది ఫార్మాసిటీ కాద‌ని, ఇండ‌స్ట్రియ‌ల్ కారిడార్ అని వివ‌రించారు. నియోజ‌క‌వ‌ర్గంలోని యువ‌త‌, మ‌హిళ‌ల‌కు ఉపాధి క‌ల్పించ‌డ‌మే త‌న ఉద్దేశమ‌ని తెలిపారు. కాలుష్య ర‌హిత ప‌రిశ్ర‌మ‌లే ఏర్పాటు చేస్తామ‌ని, భూసేక‌ర‌ణ ప‌రిహారం పెంపును ప‌రిశీలిస్తామ‌ని హామీ ఇచ్చారు. ల‌గ‌చ‌ర్ల‌లోని భూముల‌నే తీసుకోవాల‌ని లేద‌ని ఇంకా తుది నిర్ణ‌యం తీసుకోలేద‌ని తెలిపారు. రైతుల బాధ‌లు త‌న‌కు తెలుసని, త‌ను కూడా రైతు కుటుంబం నుండే వ‌చ్చాన‌ని అన్నారు. అమాయక రైతులపై కేసుల విషయం లో పరిశీలిస్తామ‌ని చెప్పారు. కుట్ర చేసిన వాళ్ళను వదిలిపెట్టమ‌ని హెచ్చ‌రించారు.

మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా చాలా వెన‌క‌బ‌డింద‌ని యువ‌త‌కు ఉపాధి లేక ఇబ్బంది ప‌డుతున్నార‌ని సీఎం క‌మ్యూనిస్టుల నేత‌ల‌కు చెప్పారు. నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేసేందుకే ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. భూముల సేక‌ర‌ణ‌లో మార్పులు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. వామ‌ప‌క్ష నేత‌లు ఇచ్చిన రిపోర్టును ప‌రిశీలిస్తామ‌ని సీఎం తెలిపారు. మ‌రోవైపు ప్ర‌తిప‌క్షాలు ప్ర‌భుత్వం కుట్ర చేస్తున్నాయ‌ని నేత‌ల మ‌ధ్య చ‌ర్చ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×