E-Paper
Advertisement

KCR : తెలంగాణలో స్వర్ణయుగం.. ప్రజల ఆశలు, అవసరాలే బీఆర్ఎస్ ఎజెండా : కేసీఆర్

KCR : తెలంగాణలో స్వర్ణయుగం.. ప్రజల ఆశలు, అవసరాలే బీఆర్ఎస్ ఎజెండా : కేసీఆర్
Advertisement

KCR : హైదరాబాద్ గోల్కొండ కోటలో ఇండిపెండెన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సాధించిన విజయాలు వివరించారు. దేశంలో వనరులు చాలా ఉన్నాయన్నారు. పాలకుల అసమర్థతతో వాటిని సరిగ్గా వినియోగించుకోవడం లేదన్నారు. దేశం ఆశించిన లక్ష్యాలను ఇంకా చేరుకోలేదని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ ప్రజల ఆశలు , అవసరాలకు అనుగుణంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు.

సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి చెందలేదని కేసీఆర్ అన్నారు. అప్పట్లో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ఆ కష్టాల నుంచి రైతులను గెట్టేక్కించామన్నారు. తాగు, సాగు నీటి కష్టాలు తీరిపోయాయన్నారు. సాగునీటి రంగంలో స్వర్ణయుగం వచ్చిందని చెప్పారు. ఇప్పడు తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ టాప్ లో ఉందని వెల్లడించారు. నిరంతరం విద్యుత్ సరఫరాతో రాష్ట్రం వెలుగుతోందన్నారు. ఒకప్పుడు రైతులు ఎన్నో కష్టాలు పడ్డారని గుర్తు చేశారు. ఇప్పవరకు రూ. 37 వేల కోట్ల రైతుల రుణమాఫీ చేశామన్నారు. సమైఖ్య రాష్ట్రంలో వరి ఉత్పత్తిలో తెలంగాణలో 15వ స్థానంలో ఉంటే ఇప్పడు అగ్రస్థానానికి పోటీ పడుతోందని చెప్పారు.

Advertisement

హైదరాబాద్ లో నేటి నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ చేపడుతున్నామని కేసీఆర్ తెలిపారు.

అంతకు ముందు సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో అమర వీరుల స్తూపం వద్ద కేసీఆర్‌ నివాళులు అర్పించారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఇండిపెండెన్స్ డే వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేశారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×