E-Paper
Advertisement

CM KCR: 50 లక్షలు, పూర్తి జీతం, ఉద్యోగం.. ఫారెస్ట్ ఆఫీసర్ మృతిపై సీఎం కేసీఆర్ రియక్షన్

CM KCR: 50 లక్షలు, పూర్తి జీతం, ఉద్యోగం.. ఫారెస్ట్ ఆఫీసర్ మృతిపై సీఎం కేసీఆర్ రియక్షన్
Advertisement

CM KCR: దారుణం. ఘోరం. విధుల్లో ఉన్న అటవీ అధికారిపై మూకుమ్మడిగా దాడి చేశారు గుత్తికోయలు. గొడ్డళ్లు, వేట కొడవళ్లతో విచక్షణారహితంగా అటాక్ చేశారు. ఆ దాడిలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు భూముల వివాదమే ఇంతటి దారుణానికి కారణమైంది. యావత్ ప్రభుత్వ యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

విషయం తెలిసిన వెంటనే సీఎం కేసీఆర్ సీరియస్ గా స్పందించారు. అధికారులపై దాడులను ఎట్టి పరిస్థితుల్లో సహించమని హెచ్చరించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదంటూ భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి.

Advertisement

మృతుడు శ్రీనివాస్ కుటుంబానికి 50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. రిటైర్ మెంట్ వయసు వచ్చే వరకు ఆయన కుటుంబానికి పూర్తి వేతనం అందించాలని.. ఫ్యామిలీలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించారు. ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని.. ఆ ఏర్పాట్లను మంత్రులు పువ్వాడ అజయ్, ఇంద్రకరణ్ రెడ్డిలు చూసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు.

మరోవైపు, పోడు భూముల వివాదమే ఈ ఘటనకు కారణం కావడంతో.. ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఏళ్లుగా పోడు వివాదం నడుస్తోందని.. అటవీ అధికారులు, గిరిజనుల మధ్య అనేక సార్లు ఘర్షణలు జరిగాయని.. అయినా సర్కారు ఇప్పటి వరకూ పోడు సమస్యలపై దృష్టి పెట్టకపోవడమే ఈ దారుణానికి కారణమంటూ తప్పుబడుతున్నారు. సీఎం కేసీఆర్ సైతం త్వరలోనే పోడు భూముల సమస్య పరిష్కరిస్తానంటూ పదే పదే చెబుతున్నారు కానీ, పట్టుంచుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాస్ మృతికి ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×