E-Paper
Advertisement

Hyderabad: మాదాపూర్‌లో కారు బీభత్సం.. అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను ఢీకొన్న కారు..

Hyderabad: మాదాపూర్‌లో కారు బీభత్సం.. అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను ఢీకొన్న కారు..
Advertisement

Hyderabad: నగరంలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. బైకులు, కార్లతో నానా హంగామా చేస్తున్నారు. హైదరాబాద్ లోని మాదాపూర్‌లో బుధవారం అర్ధరాత్రి ఓ కారు భీభత్సం సృష్టించింది. అతివేగంతో వచ్చిన కారు మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టింది. మద్యం మత్తులో కారు నడిపి ఉంటారని పోలీసుల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం తర్వాత కారుని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. వాహనం ఎవరు నడిపారన్న వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

మరోవైపు కరీనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. రామడుగు మండల కేంద్రానికి చెందిన సామంతుల శివాజీ.. నీలం అరుణ్ అనే ఇద్దరు యువకులు కరీంనగర్ నుండి సొంత ఊరి వైపు వస్తుండగా.. షానగర్ గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం వీరి బైక్‌ని ఢీ కొట్టింది.

Advertisement

Also Read: మెదక్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రేమించలేదని యువతిపై..

అయితే రెండు వాహనాలు వేగంగా రావడంతో శివాజీ అనే యువకుడి స్పాట్ లోనే మృతి చెందాడు. కొద్ది సేపటి తర్వాత నీలం అరుణ్ ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతి దేహాలను పోస్ట్ మార్టానికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో అందరితో కలివిడిగా ఉండే యువకుల మరణించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరవతున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×