E-Paper
Advertisement

Mancherial : మహిళకు వేధింపులు.. పట్టపగలే యువకుడి దారుణ హత్య..

Mancherial : మహిళకు వేధింపులు.. పట్టపగలే యువకుడి దారుణ హత్య..
Advertisement

Mancherial : మంచిర్యాల జిల్లాలో భయానక ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో వేధిస్తూడంటూ..ఓ యువకుడ్ని ఓ కుటుంబం అత్యంత దారుణంగా హత మార్చింది. బండరాయితో కొట్టి హత్య చేసింది. తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి బాధిత మహిళ ఆ యువకుడిని చంపేసింది.

జైపూర్‌ మండలం ఇందారం గ్రామంలో ఈ దారుణ హత్య జరిగింది. గ్రామానికి చెందిన మహేశ్ అనే యువకుడు….ప్రేమ పేరుతో కొన్నాళ్లుగా వివాహితను వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపణలున్నాయి. బాధితురాలు గతంలో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిందని తెలుస్తోంది. అయినా సరే మహేశ్ నుంచి వేధింపులు ఆగకపోవడంతో హత్య చేసినట్లు తెలుస్తోంది.

ఊరంతా చూస్తుండగానే మహేష్ ను కిరాతకంగా హత్య చేశారు. అతడు బైక్‌ వెళుతుండగా అడ్డగించి దాడికి దిగారు. తొలుత గొంతు కోశారు. ఆ తర్వాత బండరాయితో తల పగులకొట్టారు. ఆ సమయంలో స్థానికులు ఈ దాడిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.

Advertisement

వివాహిత తన తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి మహేష్‌ను చంపినట్లు పోలీసులు తెలిపారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యపై విచారణ చేపట్టారు. మహేష్‌ను చంపిన నలుగురు నిందితులను తమకు అప్పగించాలంటూ మృతుడి కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×