E-Paper
Advertisement

BRS Party: బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా సుధీర్ కుమార్..

BRS Party: బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా సుధీర్ కుమార్..
Advertisement

BRS Party: వరంగల్ బీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. వరంగల్ జిల్లా నేతల సమావేశంలో కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు.

కేసీఆర్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ పేరును ఫైనల్ చేశారు. వరంగల్ ఎంపీ అభ్యర్థి ఎంపికపై ఆ నియోజకవర్గం పరిధిలోని బీఆర్ఎస్ నాయకులతో సమావేశమైన కేసీఆర్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.

Advertisement

మాదిగ సామాజిక వర్గానికి చెందిన సుధీర్ కుమార్ ప్రస్తుతం హన్మకొండ జడ్పీ చైర్మన్ గా కొనసాగుతున్నారు. 2001 నుంచి సుధీర్ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఎంపీ అభ్యర్థిగా సుధీర్ సరైన వ్యక్తిగా భావిస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని నియోజకవర్గ నేతలు ఆమోదించారు. అయితే ఈ టికెట్ తొలుత.. ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు ఇస్తారని ప్రచారం జరిగింది. ఈ టికెట్ రాజయ్యకు దక్కకపోవడంతో ఆయన పార్టీపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.

కాగా, గతంలో వరంగల్ ఎంపీ టికెట్ ను బీఆర్ఎస్ కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు కేటాయించింది. అయితే ఆమె బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో ఈ టికెట్ ను కేసీఆర్ మారేపల్లి సుధీర్ కుమార్ కు కేటాయించారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×