E-Paper
Advertisement

రైతులపై కక్షనా? బీఆర్ఎస్ పార్టీపై కక్షనా? కాంగ్రెస్‌పై శ్రీనివాస్ గౌడ్ ఫైర్!

రైతులపై కక్షనా? బీఆర్ఎస్ పార్టీపై కక్షనా? కాంగ్రెస్‌పై శ్రీనివాస్ గౌడ్ ఫైర్!
Advertisement

Srinivas Goud: రాష్ట్రంలో రైతుల పరిస్థితి తీవ్ర ఆందోళన కరంగా ఉందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వర్షాలు లేక పత్తి చేలు ఎండిపోతున్నాయన్నారు. వరి నార్లకు ట్యాంకర్ల ద్వారా నీళ్లు నింపుకునే పరిస్థితి వచ్చిందన్నారు. మరోవైపు ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలు కృష్ణా, గోదావరి జలాలను వాడుకుంటుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి రైతులపై కక్షనా? బీఆర్ఎస్ పార్టీపై కక్షనా? అని ఆయన నిలదీశారు.

తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన శ్రీనివాడ్.. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎల్ ని నో పైనే చర్చ జరుగుతోందన్నారు. కృష్ణా, గోదావరి జలాలు వచ్చి.. పంటలు పండితే రైతు బంధు, బోనస్ ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆరోపించారు. అటు రాష్ట్రంలో యూరియా సరఫరా లేదని.. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు. కేసీఆర్ తెలంగాణలో కరువు రాకుండా ఉండేందుకు ప్రాజెక్టులు నిర్మించారని.. ఇప్పుడు ఆయన్ను బదనాం చేసి కాలం గడపాలని చూస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

ప్రపంచంలో అప్పులు చేయని దేశం లేదని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణకు కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే దిక్కు అవుతుందన్నారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గజ్వేల్ లో మీటింగ్ పెట్టినా తాము పర్మిషన్ ఇచ్చామన్నారు. సరూర్ నగర్ మీటింగ్ కు పర్మిషన్ ఇవ్వకపోతే కోర్టు పర్మిషన్ ఇచ్చిందన్నారు. రాహుల్ గాంధీ అశోక్ నగర్ వచ్చినప్పుడు ఉంది పెయిడ్ బ్యాచ్, పెయిడ్ జేఏసీనా? అని నిలదీశారు.

Also Read: మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Advertisement

ఇచ్చిన హామీలు ప్రశ్నిస్తే పెయిడ్ బ్యాచ్ ఎలా అవుతారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. విద్యార్థులపై ఆంక్షలు లేకుండా వదిలేయాలన్నారు. లేదంటే రాష్ట్రం పరువురు పోగొట్టుకోవాల్సి వస్తుందని సూచించారు. కాగా ఈ మీడియా సమావేశంలో సమావేశంలో టాడీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.

Also Read: ఫ్రీ వైఫై వాడుతున్నారా? పాస్‌వర్డ్‌లు ఒకటే పెట్టారా? అయితే మీ సేవింగ్స్ గోవిందా!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×