E-Paper
Advertisement

KTR on Kavitha’s Letter: కవితకు కేటీఆర్.. డైరెక్ట్ వార్నింగ్

KTR on Kavitha’s Letter: కవితకు కేటీఆర్.. డైరెక్ట్ వార్నింగ్
Advertisement

KTR on Kavitha’s Letter: మాజీ సీఎం కేసీఆర్‌కు కవిత రాసిన లేఖపై కేటీఆర్ తాజాగా స్పందించారు. మా పార్టీలో సూచనలు చేయాలనుకుంటే ఎవరైనా లేఖలు రాయొచ్చు.. అంతర్గతంగా మాట్లాడుకునే విషయాలు అంతర్గతంగా మాట్లాడుకుందాం. మా పార్టీలో అందరూ సమానమే అని కేటీఆర్ కవితను ఉద్దేశించి మాట్లాడారు.

సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్​ పార్టీపై బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్​ అధిష్ఠానానికి డబ్బులు కావాలంటే తెలంగాణ నుంచి తరలిస్తున్నారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్​లో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Advertisement

ఈ సందర్భంగా కాంగ్రెస్​, బీజేపీపై పలు విమర్శలను గుప్పించారు. రాష్ట్రంలో యంగ్​ ఇండియా పేరుతో వసూళ్లు చేస్తున్నారని కేటీఆర్​ ఆరోపిస్తున్నారు. ఈడీ ఛార్జిషీట్​లో సీఎం రేవంత్ రెడ్డి పేరు ఉంటే రాహుల్​గాంధీ ఎందుకు స్పందించరని కేటీఆర్​ ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేటీఆర్​ కాంగ్రెస్​పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Also Read: మాట మార్చిన హరీష్.. మరి కవిత లెక్కలేంటి?

Advertisement

ఆర్​ఆర్​ ట్యాక్స్​పై ప్రధాని మోదీ ఎందుకు విచారణకు ఆదేశించట్లేదని కేటీఆర్​ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి ఢిల్లీలో ఇద్దరు బాస్​లు ఉన్నారని ఒకరు రాహుల్​ గాంధీ, మరొకరు ప్రధాని మోదీ అని కేటీఆర్​ ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డి విషయంలో బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటోందని ప్రశ్నించారు. తెలంగాణలో ఎన్ని స్కాంలు జరుగుతున్న కేంద్రం ఎందుకు స్పందించటం లేదని ఫైర్ అయ్యారు. తెలంగాణలో జరుగుతున్న స్కాంల పై నెల రోజుల్లో కేంద్రం స్పందిస్తుందా లేదా చూస్తాం. స్పందించకపోతే తమ పార్టీలో చర్చించి కార్యాచరణ చేపడతాం అన్నారు. తెలంగాణకు పట్టిన దెయ్యం రేవంత్ రెడ్డి.. శని కాంగ్రెస్ పార్టీ అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు కేటీఆర్.

ఇదిలా ఉంటే.. కేసీఆర్‌కు కవిత లేఖ రాయడం హాస్యాస్పద మన్నారు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు. కేసీఆర్ కుటుంబంలో వర్గ పోరు ఎప్పటినుంచో మొదలైందన్న ఆయన.. కాళేశ్వరం అక్రమాల విచారణ టాపిక్‌ను డెవర్ట్‌ చేసేందుకే తెరపైకి లేఖ తెచ్చిందన్నారు. కేసీఆర్ పక్కన పనిచేసే సంతోష్ రావు వ్యూహంలో భాగమే ఈ లెటర్‌ అని, తండ్రి కూతురుల మధ్య లేఖలు రాసుకోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు ఎమ్మెల్యే నాగరాజు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×