E-Paper
Advertisement

Hospital : ఇద్దరు బాలింతలు మృతి.. మలక్‌పేట్‌ ఏరియా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత..

Hospital : ఇద్దరు బాలింతలు మృతి.. మలక్‌పేట్‌ ఏరియా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత..
Advertisement

Hospital : ప్రభుత్వ ఆస్పత్రుల్లో బాలింతల మృతి ఘటనలు మరోసారి తెలంగాణలో కలకలం రేపాయి. ఇద్దరు బాలింతల మృతి చెందడంతో హైదరాబాద్ మలక్‌పేట్‌ ఏరియా ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింతలు ప్రాణాలు కోల్పోయారని ఆరోపిస్తూ బాధిత కుటుంబాలు ఆందోళన చేపట్టాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

నాగర్‌కర్నూలు జిల్లా వెల్దండ మండలం చెదురుపల్లి గ్రామానికి చెందిన మహేశ్‌ హైదరాబాద్ లో కారు డ్రైవర్ గా పనిచేస్తున్నారు. తన భార్య సిరివెన్నెల (23)ను ఇటీవల కాన్పు కోసం మలక్‌పేట్‌ ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆపరేషన్ చేసి వైద్యులు కాన్పు చేయగా సిరివెన్నల ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత అస్వస్థతకు గురికావడంతో వైద్యులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సిరివెన్నెల ప్రాణాలు కోల్పోయింది. మలక్‌పేట్ ఏరియా ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయిందంటూ ఆరోపిస్తూ ఆమె బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని చాదర్‌ఘాట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబసభ్యులు ఆస్పత్రి వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.

Advertisement

తిరుపతికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ జగదీశ్‌.. తన భార్య శివాణి ఈ నెల 9న మలక్‌పేట్‌ ఆస్పత్రిలో బాబుకు జన్మనిచ్చారు. ఆ తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో మలక్‌పేట్‌ ఆస్పత్రి వైద్యులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శివాని ప్రాణాలు కోల్పోయింది.

ఒకే సమయంలో ఇద్దరు బాలింతలు మృతి చెందటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్ని నెలల క్రితం ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి కొందరు బాలింత మృత్యువాత పడ్డారు. తరచూ ఇలాంటి ఘటనలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరగడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×