E-Paper
Advertisement

Booster Dose: బూస్టర్ డోస్‌తో లాభమెంత? పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎంత?

Booster Dose: బూస్టర్ డోస్‌తో లాభమెంత? పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎంత?
Advertisement
covid-booster-dose

Booster Dose: ప్రపంచవ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తోంది. భారత్ లో మరోసారి కేసులు చాపకింద నీరులా పెరుగుతున్నాయి. గతేడాది ఒమిక్రాన్ వేరియంట్ భయపెడితే.. ఇప్పుడు XBB 1.16 వేరియంట్ ఎఫెక్ట్ కనిపిస్తోందని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. ప్రతి ఏడాది ఎండాకాలం టైంలో కరోనా కోరలు చాస్తోంది. ఇప్పుడు కూడా కొత్త వేరియంట్ రూపంలో ఇండియాపై ప్రభావం చూపుతోంది. గత కొన్ని రోజులుగా ఢిల్లీ సహా మెట్రోపాలిటన్ సిటీస్ లో కరోనా చాలా వేగంగా వ్యాపిస్తూ వస్తోంది. పాజిటివిటీ రేటు కొన్ని చోట్ల 20 శాతానికి పైనే ఉంటోంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన రేటు కంటే చాలా ఎక్కువ. ఎక్కడైతే పాజిటివిటీ రేటు 5 శాతానికి మించి ఉంటే అక్కడ అలర్ట్ అవ్వాలని, వైరస్ వ్యాప్తిపై నిఘా పెట్టాలని WHO చెప్పిన సందర్భాలున్నాయి. అయితే ఇప్పుడు కరోనా విజృంభిస్తుండడం, దేశంలో రోజుకు 10 వేలకు పైనే కొత్త కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అలాగే ఇప్పటి వరకు దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 60 వేలు దాటిపోయింది.

కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ సర్కారు అలర్ట్ అయింది. రాష్ట్రవ్యాప్తంగా బూస్టర్ డోస్ ఇస్తున్నారు. అయితే, బూస్టర్ డోసుపై జనాలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. సైడ్ ఎఫెక్టుల భయం కొందరిలో ఉంటే.. ఇప్పుడు వ్యాక్సిన్ అవసరమా? అనే భావన మరికొందరిది.

Advertisement

బూస్టర్ డోస్‌తో అంతగా ప్రయోజనం ఉండదని ఎయిమ్స్ డాక్టర్ సంజయ్‌రాయ్‌ అభిప్రాయపడ్డారు. RNA వైరస్‌లో మ్యుటేషన్ కారణంగా, కేసులు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. రాబోయే రోజుల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోందని అంతమాత్రాన భయాపడాల్సిన అవసరంలేదని అన్నారు. కొత్త వేరియంట్‌ల బారిన పడే వ్యక్తులు కొత్త రోగనిరోధక శక్తిని పొందుతారని అన్నారు.

కొవిడ్ ప్రారంభ దశలో ప్రజలకు రోగనిరోధక శక్తి లేదు. అప్పుడు వారికి వ్యాక్సిన్లు అవసరం. కానీ ఇప్పుడు దేశంలోని ప్రజలందరికీ కొవిడ్ సోకింది. ఆ తర్వాత సహజ రోగనిరోధక శక్తి పెరిగింది. వ్యాక్సిన్ కంటే వైరస్ నుంచి రక్షించడంలో రోగనిరోధక శక్తి మరింత మెరుగ్గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇన్‌ఫెక్షన్‌ను తగ్గించేందుకు స్టెరాయిడ్స్‌ ఇవ్వడం వల్ల మరింత హాని జరిగే అవకాశముందని తెలిపారు.

Advertisement

ప్రస్తుతం కరోనా, ఇన్‌ఫ్లూయెంజా రెండూ వ్యాప్తి చెందుతున్నాయి. ఇన్‌ఫ్లూయెంజా వైరల్ ఇన్ఫెక్షన్ అని, ఇది సీజన్ ప్రకారం ప్రతి ఏడాది వస్తోందని అన్నారు. దీనిపై టీకా బూస్టర్ మోతాదు ఎంత ప్రభావం చూపుతోందనే దానిపై ఎలాంటి పరిశోధనలు తెరపైకి రాలేదు. సాధ్యాసాధ్యాల ఆధారంగా మాత్రమే, బూస్టర్ డోస్ ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పలేమని అన్నారు.

పరీక్షల సంఖ్య పెంచుతున్నకొద్దీ కొవిడ్ కేసులూ పెరుగుతుంటాయని.. ఆస్పత్రుల్లో చేరడం, తీవ్రత పెరగకుండా ఉండడం ముఖ్యమని నిపుణులు అంటున్నారు. అయితే తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×