E-Paper
Advertisement

Group-1 Mains Exam: గ్రూప్ -1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. మెయిన్స్ పరీక్షా సమయాల్లో మార్పు

Group-1 Mains Exam: గ్రూప్ -1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. మెయిన్స్ పరీక్షా సమయాల్లో మార్పు
Advertisement

Group -1 mains exam timings(TS today news): టీజీపీఎస్సీ తాజాగా కీలక ప్రకటన చేసింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా సమయాల్లో మార్పులు చేసినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి ఇతర మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా సమయాల్లో మార్పులు చేసినట్లు టీజీపీఎస్సీ పేర్కొన్నది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరగనున్న గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలను తొలుత మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. తాజాగీ పరీక్షా సమయాలను మారుస్తూ నిర్ణయం తీసుకుంది.

Also Read: తెలంగాణ వాసులకు అలర్ట్.. రానున్న 3 గంటల్లో ?

Advertisement

31,382 మంది అభ్యర్థులు క్వాలిఫై..

తెలంగాణలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఈ ఏడాది జూన్ 9వ తేదీన టీడీపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 897 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, 4.03 లక్షల మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్షలకు హాజరయ్యారు. 1:50 నిష్పత్తిలో ఈ పరీక్షా ఫలితాలను జులై 7న టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 31,382 మంది అభ్యర్థులు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు క్వాలిఫై అయినట్లు స్పష్టం చేసింది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు ఈ అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నామంటూ టీజీపీఎస్సీ ఆ సందర్భంగా పేర్కొన్నది.

Advertisement

Also Read: మీ విజన్ సూపర్.. ప్రభుత్వంపై ఫాక్స్‌కాన్ చైర్మన్ ప్రశంస

తెలంగాణ గ్రూప్ -1 మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూలు..

అక్టోబర్ 21, 2024 – జనరల్ ఇంగ్లీష్ (అర్హత సాధిస్తే చాలు)
అక్టోబర్ 22, 2024 – పేపర్ -1 (జనరల్ ఎస్సే)
అక్టోబర్ 23, 2024 – పేపర్ -2 (హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ)
అక్టోబర్ 24, 2024 – పేపర్ -3 (ఇండియన్ సొసైటీ, కానిస్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్)
అక్టోబర్ 25, 2024 – పేపర్ -4 (ఎకానమీ అండ్ డెవలప్ మెంట్)
అక్టోబర్ 26, 2024 – పేపర్ -5 (సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్ ప్రిటేషన్)
అక్టోబర్ 27, 2024 – పేపర్ -6 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతరణ)

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×