E-Paper
Advertisement

Bhupalpalli: ఘోర విషాదం.. ఒకేరోజు తండ్రీకొడుకులకు గుండెపోటు

Bhupalpalli: ఘోర విషాదం.. ఒకేరోజు తండ్రీకొడుకులకు గుండెపోటు
Advertisement

Father and son have heart attacks in Bhupalpalli: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒకేరోజు తండ్రీకొడుకులకు గుండెపోటు రావడంతో మృతి చెందారు. మొదట తండ్రికి గుండెపోటు రావడంతో తట్టుకోలేని కొడుకు రోదనలకు అదే రోజు గుండెపోటు వచ్చింది. ఈ విషాదకర ఘటన జిల్లాలోని పెద్దంపేట గ్రామంలో జరిగింది.

వివరాల ప్రకారం.. పెద్దంపేట గ్రామానికి చెందిన బీసులు పెద్ద లస్మయ్య(62)కు సోమవారం ఉదయం గుండెపోటుతో చనిపోయాడు. దీంతో కొడుకు కృష్ణం రాజు రోదనలు కంటతడి పెట్టించాయి. తనకు ఎంతో ఇష్టమైన తన తండ్రి ఇకలేరని వార్తను జీర్ణించుకోలేకపోయాడు. తనను అల్లారుముద్దుగా పెంచిన తండ్రి మరణాన్ని తట్టుకోలేక గంటల వ్యవధిలోనే గుండెపోటుతో కృష్ణం రాజు మృతి చెందాడు. ఈ హృదయవిచారక ఘటనను చూసిన గ్రామస్తులు సైతం కంటతడిపెట్టారు.

Advertisement

Alao Read: ఏసీబీకి చిక్కిన జాయింట్ కలెక్టర్, ధరణి.. ఆపై 8 లక్షలు..

లస్మయ్య చనిపోవడంతో కొడుకు కృష్ణం రాజు తల్లడిల్లిపోయాడు. ఉదయం నుంచి రోదిస్తూనే అంత్యక్రియలు చేసిన కృష్ణంరాజు సాయంత్రం గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. స్థానికులు, కుటుంబసభ్యులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించేందుకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. ఇలా ఒకేరోజు తండ్రీకొడుకులు మరణించడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×