E-Paper
Advertisement

Bharat Jodo Yatra : మహబూబ్ నగర్ లో భారత్ జోడో యాత్ర..పాదయాత్రలో పాల్గొన్న పూనమ్ కౌర్

Bharat Jodo Yatra : మహబూబ్ నగర్ లో భారత్ జోడో యాత్ర..పాదయాత్రలో పాల్గొన్న పూనమ్ కౌర్
Advertisement

Bharat Jodo Yatra : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. తెలంగాణలో నాలుగో రోజు మహబూబ్ నగర్ మండల పరిధిలోని ధర్మాపూర్ లోని జయప్రకాశ్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ప్రారంభమైంది. రాహుల్ తోపాటు పార్టీ జాతీయ నేతలు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్, తెలంగాణ కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, మధుయాష్కీ , పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే సీతక్క పాదయాత్రలో పాల్గొన్నారు. 15 కిలోమీటర్ల పాటు సాగిన పాదయాత్రలో చిన్నారులు, యువకులు, మహిళలు, కళాకారులు, వివిధ సంఘాల నేతలు, కార్మికులతో రాహుల్ ముచ్చటించారు. ఇదే సమయంలో సినీనటి పూనమ్ కౌర్ భారత్ జోడో యాత్రలో ప్రత్యక్షమయ్యారు. ఆమె రాహుల్ తోపాటు భారత్ జోడో యాత్ర చేశారు. భద్రాచలం నుంచి వచ్చిన గిరిజనులతో కలిసి రాహుల్ సంప్రదాయ నృత్యం చేసి ఆకట్టుకున్నారు. చేనేత కార్మికులు వారి సమస్యలను రాహుల్ దృష్టికి తీసుకొచ్చారు. ఎన్ఎస్ యూఐ ఆధ్వర్యంలో 3 వేల మంది విద్యార్థులతో ర్యాలీ చేశారు. ఉస్మానియా , కాకతీయ విశ్వవిద్యాలయాల విద్యార్థలు రాహుల్ కలిసి వర్శిటీ సమస్యలను వివరించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×