E-Paper
Advertisement

Bharat Jodo Yatra : సంగారెడ్డి జిల్లాలో భారత్ జోడో యాత్ర జోష్.. రాహుల్ పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశాలు

Bharat Jodo Yatra : సంగారెడ్డి జిల్లాలో భారత్ జోడో యాత్ర జోష్.. రాహుల్ పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశాలు
Advertisement

Bharat Jodo Yatra : సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. పటాన్‌చెరు మండలం రుద్రారం శివారులోని గణేశ్‌ ఆలయం నుంచి ఉదయం 6 గంటలకు పాదయాత్రను రాహుల్ ప్రారంభించారు. చిన్నారులతో సరదాగా క్రికెట్‌ ఆడారు. పాఠశాల విద్యార్థులతో చేతులు కలిపి పాదయాత్ర కొనసాగించారు. నియోజకవర్గంలో గంగపుత్ర, పోతురాజు, కల్లుగీత కార్మికులు సంప్రదాయ వేషధారణలో రాహుల్‌కు స్వాగతం పలికారు. రాహుల్‌ వెంట ఏఐసీసీ నేతలు బోసురాజు, దిగ్విజయ్‌ సింగ్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సంగ్గారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉన్నారు. దివ్యాంగులకు రాహుల్‌ చేతుల మీదుగా వీల్‌ఛైర్లను అందజేశారు. రామ్‌మందిరం సమీపంలో ఇందిరాగాంధీ కుటుంబంపై ఏర్పాటు చేసి ఫొటో ఎగ్జిబిషన్‌ను రాహుల్‌ తిలకించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి పోతురాజు మాదిరిగా కొరడాతో రాహుల్‌ కొట్టుకోవడం అందరినీ ఆకట్టుకుంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×