E-Paper
Advertisement

బంధం చెరువును చంపేస్తున్న అధికారయంత్రాంగం.. ఇప్పటికైనా స్పందిస్తారా..!

బంధం చెరువును చంపేస్తున్న అధికారయంత్రాంగం.. ఇప్పటికైనా స్పందిస్తారా..!
Advertisement

Bandham Cheruvu: స్వేచ్ఛ బ్యూరో: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం చౌదర్ పల్లి గ్రామ బంధం చెరువు మత్తడి నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. కొండపోచమ్మ రిజర్వాయర్ నుండి హల్దివాగులోకి భారీగా నీటిని వదలడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మత్తడికి గండిపడి చెరువులో నీరు ఖాళీ అయినా 15 రోజులు గడిచిన యంత్రాంగంలో స్పందన లేకపోవడం గమనార్హం. ఈ చెరువు మత్తడి పారితే హల్దివాగులో కాలేశ్వరం నీళ్లు పరుగులు తీస్తాయి. నీటి ప్రవాహా ఉధృతికి బంధం చెరువు మత్తడి పూర్తిగా కొట్టుకుపోయింది. చెరువులో నిల్వ ఉండే నీరు సుమారు 70 శాతం బయటకు వెళ్లిపోగా గత 15 రోజులుగా నిల్వ నీరు పూర్తిగా అడుగంటిందని గ్రామస్తులు చెబుతున్నారు.

అప్పటి సీఎం కేసీఆర్..

కాలేశ్వరం జలాలను కొండపోచమ్మ రిజర్వాయర్ నుండి హల్ది వాగులోకి వదలడానికి ముందుగా ఈ బంధం చెరువులోకి విడుదల చేస్తారు. తొలిసారి ఈ చెరువులోకి అప్పటి సీఎం కేసీఆర్ నీటిని విడుదల చేశారు. ఈ చెరువు నుండి వర్గల్ పెద్ద చెరువు, శాకారం చెరువు నుండి ఖాన్ చెరువు ద్వారా హల్ది వాగులోకి నీరు ప్రవహిస్తుంది. నాచగిరి పుణ్యక్షేత్రం వద్ద చెక్ డ్యామ్ ముత్తడి దూకి తూప్రాన్ మీదుగా హల్ది వాగులో ప్రయాణించి మంజీరా నది లోకి చేరుతుంది. కొండపోచమ్మ రిజర్వాయర్ నుండి సంగారెడ్డి, రామాయంపేట కాలువలకు నీటిని వదిలారు. నాచగిరి బ్రహ్మోత్సవాలు ఉన్నందున హల్దివాగులోకి నీటిని పెద్ద మొత్తంలో విడుదల చేశారు. ఈ ప్రవాహా ఉధృతికి బంధం చెరువు మత్తడి పూర్తిగా కొట్టుకుపోయింది. చెరువులోని నీరు 70% బయటికి వెళ్లిపోయింది.

Advertisement

Also Read: ప్రయాణీకులకు గుడ్ న్యూస్, హైదరాబాద్ నుంచి ఆ ప్రాంతానికి 3 వీక్లీ రైళ్లు!

మరమ్మత్తులు జరిగేనా..

బంధం చెరువు కట్ట బలహీనంగా ఉందిని గుర్తించి నాలుగేళ్ల క్రితమే చెరువు కట్ట, మత్తడి మరమ్మతులకు సుమారు రూ 70 లక్షలు అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే అధికారులు పట్టించుకోక పోవడంతో పనులు జరగలేదు. చెరువు కట్ట, మత్తడి సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకొని నీటిని వదలవలసి ఉండగా అధికారులు ఇదేది పట్టించుకోకుండా పెద్ద మొత్తంలో నీటిని వదలడంతో మత్తడి కొట్టుకుపోయినట్లు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు టూరిజం స్పాట్ గా ఏర్పాటు చేసే ప్రణాళికలో భాగంగా బంధం చెరువును కూడా పర్యాటక కేంద్రంగా మార్చడానికి నిధులు మంజూరు చేయాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరారు. మత్తడిని, కట్టను పటిష్టం చేసి మినీ ట్యాంక్ బండ్ గా సుందరీకరించాలని పేర్కొన్నారు.

Advertisement

Also Read: రాష్ట్రంలో భూతగాదాలకు ఇక చెక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×