E-Paper
Advertisement

khammam : చికెన్ వ్యర్థాల సేకరణ.. రికార్డు స్థాయిలో వేలం..

khammam : చికెన్ వ్యర్థాల సేకరణ.. రికార్డు స్థాయిలో వేలం..
Advertisement

khammam : ఖమ్మం కార్పొరేషన్ అధికారులు నగరంలోని చికెన్ వ్యర్థాల సేకరణకు వేలం వేశారు. రికార్డు స్థాయిలో చికెన్ వేస్టేజీ సేకరణ గద్వాల ప్రాంత వ్యక్తి దక్కించుకున్నారు . జోగులాంబ జిల్లా గద్వాలకు చెందిన బాలరాజు అనే వ్యక్తి ఏకంగా కోటి 55 లక్షల 60 వేలకు టెండర్ ను దక్కించుకున్నారు.

గతంలో ఈ టెండర్‌ను 44 లక్షల 44 వేలకు ఒక కాంట్రాక్టర్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం మూడురెట్లు అదనంగా ధర పలికింది. ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహించగా.. ఆరుగురు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగవేలంలో రాయల్టీ పాటగా 40 లక్షలు నిర్ణయించారు.

Advertisement

జోగులాంబ గద్వాల జిల్లా.. గద్వాలకు చెందిన బాలరాజు కోటి 55లక్షల 60వేలకు పాటను దక్కించుకున్నారు. టెండర్ పొందిన కాంట్రాక్టర్ ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని 200 పైగా ఉన్న చికెన్ దుకాణాల నుంచి వ్యర్ధాలను సేకరిస్తారు. వాటిని సాంకేతిక పద్ధతిలో పొడిగా మార్చి చేపల దాణాగా తయారు చేస్తారు. అనంతరం చేపల చెరువుల యాజమానులకు అమ్ముతారు. ఇలా చేసినందుకు నగరపాలక సంస్థకు రాయల్టీ చెల్లించాలి. రాయల్టీ నిమిత్తం టెండర్లను ఆహ్వానించి బహిరంగ వేలం నిర్వహించగా ఊహించినదానికంటే ఎక్కువ రాయల్టీ లభించింది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×