E-Paper
Advertisement

Bhadradri: అటవీ అధికారిపై గుత్తికోయల దాడి.. కత్తి వేటుకు మృతి..

Bhadradri: అటవీ అధికారిపై గుత్తికోయల దాడి.. కత్తి వేటుకు మృతి..
Advertisement

Bhadradri: పోడు భూముల వివాదం ఫారెస్ట్ రేంజర్ హత్యకు దారి తీసింది. ఎన్నాళ్లుగానే సాగుతున్న వ్యవహారంలో పరిష్కారం రాకపోవడంతో గుత్తికోయలు రెచ్చిపోయారు. పోడు వ్యవసాయాన్ని అడ్డుకోవడానికి వచ్చిన ఫారెస్ట్ అధికారులపై తిరగబడ్డారు. కత్తులతో దాడి చేయడంతో రేంజర్ శ్రీనివాసరావుకు గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో చికిత్స పొందుతూ శ్రీనివాస్ చనిపోవడం ఉద్రిక్తతకు దారి తీసింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చంద్రుగొండ మండలం బెండాలపాడు అటవీ ప్రాంతం ఎర్రబోడులో.. అటవీశాఖ నాటిన మొక్కలు తొలగించేందుకు పోడు భూముల సాగుదారులు ప్రయత్నించారు. వారిని అడ్డుకోవడానికి వెళ్లిన ఫారెస్ట్ అధికారులు శ్రీనివాసరావు, రామారావుపై గిరిజనులు మూకుమ్మడిగా దాడి చేశారు. భయపడిన సెక్షన్‌ అధికారి రామారావు అక్కడ నుంచి పరారయ్యారు. అక్కడే ఉన్న ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావుపై అడవి బిడ్డలు ఆటవికంగా కత్తి, వేట కొడవలితో దాడి చేశారు.

Advertisement

గిరిజనుల దాడిలో శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డారు. మెడ భాగంలో కత్తి వేటు పడటంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. వెంటనే శ్రీనివాసరావును చంద్రుగొండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడనుంచి ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీనివాసరావు చనిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×