E-Paper
Advertisement

Revanthreddy : మాది తోడికోడళ్ల పంచాయితీ.. రేవంత్‌ – జగ్గారెడ్డి మధ్య ఆసక్తికర సన్నివేశం..

Revanthreddy : మాది తోడికోడళ్ల పంచాయితీ.. రేవంత్‌ – జగ్గారెడ్డి మధ్య ఆసక్తికర సన్నివేశం..
Advertisement

Revanthreddy : టీకాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పట్లో టీపీసీసీ చీఫ్ పదవి నుంచి రేవంత్ రెడ్డిని దింపడం ఎవరి వల్లా సాధ్యం కాదని స్పష్టం చేశారు. సీఎల్పీ కార్యాలయంలో ధరణి, భూ సమస్యలపై కాంగ్రెస్ ముఖ్యనేతలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వస్తున్న సమయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి అసెంబ్లీ ఆవరణలో ఎదురుపడ్డారు. సీఎల్పీ కార్యాలయంలోకి ఇద్దరూ కలిసి వెళ్లారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. ఈ విషయంపై మీడియా ప్రశ్నిస్తుండగానే.. రేవంత్ రెడ్డి స్పందించారు. జగ్గారెడ్డికి, తనకు మధ్య జరిగేది తోడికోడళ్ల పంచాయితీ అని తెలిపారు. ఇద్దరం కాంగ్రెస్ నేతలమని, పొద్దున తిట్టుకుంటాం.. మళ్లీ కలిసిపోతామంటూ చెప్పుకొచ్చారు.

Advertisement

అనంతరం జగ్గారెడ్డి మాట్లాడారు. తాను టీపీసీసీ చీఫ్ పదవి ఆశిస్తున్నానని తెలిపారు. రేవంత్ రెడ్డి దిగిన తర్వాతే అది సాధ్యమవుతుందన్నారు. తన కోరిక నెరవేరడానికి పదేళ్లైనా పడుతుందన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ పాదయాత్రకు తన మద్దతుపై త్వరలో ప్రకటన చేస్తానన్నారు. అనంతరం ఏఐసీసీ నేత కొప్పుల రాజు, మాజీ మంత్రి దామోదర రాజనర్సింహా తదితరులతో కలిసి ధరణి సమస్యలపై చర్చించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×