E-Paper
Advertisement

Amoy Kumar: అమోయ్ కుమార్ మెడకు మరో ఉచ్చు.. రూ.20వేల కోట్ల భూ దోపిడీ.. ఈడీకి ఫిర్యాదు చేసిన భాదితులు

Amoy Kumar: అమోయ్ కుమార్ మెడకు మరో ఉచ్చు.. రూ.20వేల కోట్ల భూ దోపిడీ.. ఈడీకి ఫిర్యాదు చేసిన భాదితులు
Advertisement

– అమోయ్ కుమార్ మెడకు మరో ఉచ్చు
– రూ.20వేల కోట్ల భూ దోపిడీ చేశారంటున్న శంకర్ హిల్స్ ప్లాట్ పర్చేస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు
– ఈడీకి ఫిర్యాదు.. న్యాయం చేయాలని వేడుకోలు
– 460 ఎకరాల 6గుంటల భూమిని కొట్టేసిన కేటుగాళ్లు
– ఫినిక్స్‌కు అప్పనంగా అప్పజెప్పిన అమోయ్

హైదరాబాద్, స్వేచ్ఛ: Amoy Kumar: రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ బాధితులు వరుసగా బయటకొస్తున్నారు. ఈడీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా తట్టి అన్నారంలోని మధురానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ బాధితులు ఫిర్యాదు చేయగా, తాజాగా వట్టినాగులపల్లిలోని శంకర్ హిల్స్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఈడీని కలిసింది. రూ.20 వేల కోట్ల భూమిని దోపిడీ చేశారని శంకర్ హిల్స్ అసోసియేషన్ సభ్యులు అంటున్నారు. వట్టినాగులపల్లిలోని సర్వే నెంబర్‌ 111 నుంచి 179లో 460 ఎకరాల 6 గుంటల ల్యాండ్‌లో భారీ కుంభంణం జరిగిన్నట్లు ఈడీకి ఫిర్యాదు చేశారు.

Advertisement

ధరణి మాటున దగా
గతంలో శంకర్ హిల్స్‌ ప్లాట్ పర్చేసర్స్‌ వెల్ఫేర్ అసోసియేషన్‌ 460 ఎకరాలు భూమిని కొనుగోలు చేసింది. ఈ భూమిని 3 వేల 328 ప్లాట్స్‌గా మార్చి విక్రయించింది. అయితే, అమోయ్ కుమార్ మాత్రం కొనుగోలు చేసిన ఓనర్ల పేర్లను ధరణిలో నమోదు చేయలేదు. తిరిగి రైతుల పేర్ల మీదకే మార్చి, తర్వాత ఫినిక్స్‌ సంస్థకు అప్పగించారు. దీంతో 3 వేల 328 మంది దాకా ప్లాట్‌ ఓనర్లు రోడ్డున పడ్డామంటున్నారు. ఈ ల్యాండ్‌ విలువ 20 వేల కోట్లపైనే మార్కెట్‌ విలువ ఉంటుంది. ఆ భూమిని అమోయ్ అక్రమార్కులకు కట్టబెట్టాడని ఆరోపిస్తున్నారు.

Also Read: Cargo Parcel Service Hyd: టీఎస్ఆర్టీసీ కొత్త సేవలు.. ఇంటి వద్దకే పార్శిల్ సర్వీస్‌లు.. ఇక అక్కడికి వెళ్లక్కర్లేదు, జస్ట్ ఇంత చెల్లిస్తే చాలు

Advertisement

ఇప్పటికే మధురానగర్ అసోసియేషన్ ఫిర్యాదు
అమోయ్‌ కుమార్‌ అరాచకాలపై ఈడీకి ఇప్పటికే రంగారెడ్డి జిల్లా తట్టి అన్నారంలోని మధురానగర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ బాధితులు ఫిర్యాదు చేశారు. అమోయ్‌ కుమార్‌ ధరణిని అడ్డు పెట్టుకొని అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. 200 ఎకరాలకు అక్రమ రిజిస్టేషన్లు చేశారని వాపోయారు. తమ ప్లాట్లను ఎకరాల్లోకి మార్చి అడ్డగోలు రిజిస్ట్రేషన్లు చేశారని ఫిర్యాదు చేశారు. హైకోర్టు స్టే ఆర్డర్‌ ఉన్నా అధికారులు పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 7 గంటలకు రిజిస్ట్రేషన్‌, రాత్రికి రాత్రే పత్రాలు సృష్టించారు అని వాపోతున్నారు బాధితులు. ఇదే సమయంలో శంకర్ హిల్స్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ కూడా ఫిర్యాదు చేయడంతో అమోయ్ సాగించిన లీలలు ఇంకెన్ని ఉన్నాయన్న చర్చ జరుగుతోంది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×