E-Paper
Advertisement

CM Revanth: తాట తీస్తాం.. సీఎం రేవంత్ మాస్ వార్నింగ్

CM Revanth: తాట తీస్తాం..  సీఎం రేవంత్ మాస్ వార్నింగ్
Advertisement

CM Revanth: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన.. బతుకమ్మ కుంటను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. అంబర్ పేటలో కబ్జాలకు గురైన బతుకమ్మ కుంటను స్వాధీనం చేసుకున్న హైడ్రా.. సుందరీకరణంగా మార్చింది.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, బతుకమ్మ కుంట పునరుద్ధరణకు సంబంధించిన తన జీవిత ఆశయం నిజమవుతుందని తెలిపారు. ఇది ఆయనకు అత్యంత సంతోషకరమైన రోజు అని పేర్కొన్నారు. గతంలో ఈ ప్రాంతం పూర్తిగా చెత్త, బీర్ బాటిల్స్ తోనే కనిపించేది. అయితే ఇప్పుడు ప్రజల కోసం అందమైన పర్యావరణాన్ని సృష్టిస్తూ, బతుకమ్మ ఆడుకునే స్థలంగా తీర్చిదిద్దడం జరిగింది.

Advertisement

హైడ్రా ప్రాంతంపై గతంలో బురద విస్తరించడం వల్ల సమస్యలు ఏర్పడ్డాయి. అందువల్ల, సీఎం రేవంత్ రెడ్డి ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రత్యేక దృష్టి పెట్టారు. కోవిడ్ తరువాత పర్యావరణ పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు వచ్చాయని ఆయన తెలిపారు. హైదరాబాద్ నగరం మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం అవసరం ఉన్నదని ఉద్దేశించారు.

2 సెంటీమీటర్ల వర్షం పడితే మాత్రమే మన దగ్గర ప్రణాళికలు అమలులో ఉంటాయి అని.. అందువల్ల పర్యావరణంలో వచ్చే మార్పులను ముందుగానే ఊహించేందుకు.. శాస్త్రవేత్తలతో సంప్రదింపులు జరిపారు. ముఖ్యంగా చెరువులు, నదుల పరిష్కారానికి ప్రభుత్వం ముందుగానే ప్రణాళికలు రూపొందించింది. ముఖ్యంగా మూసి నది పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇచ్చారు.

Advertisement

స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సూచన మేరకు మూసి నది శుద్ధి, పునరుద్ధరణకు మంచి ప్రతిపాదనలు వచ్చాయి. ఈ ప్రతిపాదనలు పరిశీలించి ప్రభుత్వం అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. నగరానికి వచ్చిన చాలామంది స్థలాలు లేకుండా మూసినది పక్కన జీవిస్తున్నారు అని సీఎం చెప్పారు. మూసి నది చుట్టూ వున్న ప్రాంతాల సమస్యలను పరిష్కరించడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

తాజాగా మూసి నది పొంగిన సంఘటనలను, MGBS ప్రాంతంలో నష్టాలను చూశామని సీఎం గుర్తు చేశారు. అంబర్‌పేటలో మూసినది పరివాహక ప్రాంతంపై మంత్రి పొన్నం ప్రభాకర్ రివ్యూ చేస్తారని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అంబర్‌పేట నియోజకవర్గ అభివృద్ధికి ఆయన సహకరిస్తారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

పేదలకు అన్యాయం చేసే పని ఏది చేయను అని ఆయన ఖచ్చితంగా అన్నారు. ప్రజల బాగోపుపై ఆయన దృష్టి సారించారు. అక్కినేని నాగార్జునను ‘ఆగర్భ శ్రీమంతుడు’గా అభివర్ణిస్తూ, గతంలో ఉన్న సావాసాలతో నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ను నిర్మించినదని గుర్తుచేశారు.

ఈ మహానగరంలో ఎన్నో మాయగాళ్లు ఉన్నారని, ప్రజలు మాయగాళ్ల మాటలను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. స్థానిక సమస్యలను పరిష్కరించడంలో నిజాయితీ, పారదర్శకత అవసరమని ఆయన చెప్పారు. ఈ సందర్భంలో, స్థానిక ఎమ్మెల్యే ప్రతిపాదన మేరకు.. బతుకమ్మ కుంటకు వి. హనుమంతరావు పేరు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

Also Read: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఆంక్షలు..

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×