E-Paper
Advertisement

Siddipet : వరుసగా రెండో రోజు.. సిద్దిపేటలో కల్తీపాల కలకలం..

Siddipet : వరుసగా రెండో రోజు.. సిద్దిపేటలో కల్తీపాల కలకలం..
Advertisement

Siddipet : సిద్దిపేట జిల్లాలోని చేర్యాల విజయ డైరీలో రెండో రోజు కల్తీ పాల విషయం కలకలం రేపింది. పాల క్యాన్లలో గుర్తుతెలియని వ్యక్తులు ఉప్పు, చక్కెర కలిపారు. చేర్యాల విజయడైరీ మేనేజర్ పాలని పరీక్షించి వాటిని తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో మేనేజర్‌తో పాల ఉత్పత్తిదారులు వాగ్వాదానికి దిగారు. పాడి రైతుల ఫిర్యాదుతో విజయ డైరీ మెనజర్ నేరుగా రైతుల వద్దకు వెళ్లారు.

రైతుల వద్ద సేకరించిన పాలను అధికారులు పరీక్షించారు. స్వచ్ఛమైన పాలు అని తెలింది. వెన్న ఎక్కువ వచ్చేందుకు పాల క్యాన్లలో ఉప్పు, చక్కెర కలిపినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికైనా పాలు కల్తీ చేస్తున్నవారి తీరు మార్చుకోవాలని విజయ డైరీ మెనజర్ హెచ్చరించారు. కల్తీ అయిన 52 క్యాన్ల పాలను పాడి రైతులు పారబోశారు.

Advertisement

కల్తీ వ్యవహారంపై అధికారులు కన్నెర జేస్తున్నా కొందరి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. బ్రాండ్‌ ముసుగులో స్వచ్ఛమైన ఆహారాన్ని సైతం కల్తీ చేసేస్తున్నారు. అయితే అధికారులు హెచ్చరించినా పట్టించుకోని కొందరు అక్రమార్కులు.. మరోసారీ చేతివాటాన్ని ప్రదర్శించారు. ఎవరు కల్తీ చేస్తున్నారో త్వరలోనే తేలుస్తామని అధికారులు అన్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. లేకపోతే ఈసారి పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని అధికారులు మండిపడ్డారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×