E-Paper
Advertisement

Accident in Hyderabad: ప్రాణం తీసిన మితిమీరిన వేగం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Accident in Hyderabad: ప్రాణం తీసిన మితిమీరిన వేగం..  రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
Advertisement

Accident in Hyderabad Students Died: హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో టిప్పర్‌ను కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామేన 4.30 గంటల సమయంలో జంక్షన్ వద్ద చోటుచేసుకుంది.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కారులో ఇరుక్కున్న వారిని బయటకు తీశారు. ఈ ప్రమాదం తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో జరిగిందన్నారు. ఈ ప్రమాదానికి కారు మితిమీరిన వేగంతో నడపడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు.

Advertisement

వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో గాయపడిన వాళ్లంతా ఇంజనీర్స్ అన్నారు. సిరి, గౌతమ్, సుదీప్ లకు గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: రాఖీ పండుగ వేళ టీఎస్ఆర్టీసీ శుభవార్త

Advertisement

ఇదిలా ఉండగా, పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని గంగానగర్ రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. వీరు మంచిర్యాల నుంచి గోదావరిఖనికి వెళ్తుండగా..లారీ ఢీకొట్టింది. ఇద్దరూ మంచిర్యాలలో ఓ షాపింగ్ లో పనిచేస్తున్నట్లు సమాచారం.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×