E-Paper
Advertisement

The Sheep distribution Scam: గొర్రెల పంపిణీ అక్రమాల కేసులో మరో ఇద్దరు అరెస్ట్

The Sheep distribution Scam: గొర్రెల పంపిణీ అక్రమాల కేసులో మరో ఇద్దరు అరెస్ట్
Advertisement

Sheep distribution scam Telangana(TS today news): గొర్రెల పంపిణీ అక్రమాల కేసులో మరో ఇద్దరిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. పశుసంవర్థక శాఖ మాజీ సీఈ రాంచందర్, మాజీ ఓఎస్డీ కల్యాణ్ ను అరెస్ట్ చేశారు. రూ. 2.10 కోట్ల విలువైన ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో వీరిని శుక్రవారం అరెస్ట్ చేశారు.

వీరిద్దరూ కూడా ప్రైవేట్ వ్యక్తులతో కలిసి అక్రమంగా అనుచిత లబ్ధి పొంది ప్రభుత్వ ఖజానాకు అన్యాయమైన నష్టం కలిగించి రూ. 2.10 కోట్ల విలువైన ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని ఏసీబీ గుర్తించింది. దీంతో వారిద్దరినీ అరెస్ట్ చేసింది. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి వారికి 2 వారాల రిమాండ్ విధించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Also Read: ‘అమరవీరుల స్థూపం ఉంటే కేటీఆర్‌కు అభ్యంతరం ఎందుకు..?’

కాగా, గొర్రెల పంపిణీ స్కామ్ కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. గతంలో కూడా ఈ కేసుకు సంబంధించి పలువురిని ఏసీబీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో తాజాగా అరెస్ట్ చేసినవారితో కలిపి ఇప్పటివరకు మొత్తం 10 మందిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఏసీబీ దూకుడు పెంచడంతో భవిష్యత్ లో ఇంకా ఎవరెవరిని అరెస్ట్ చేస్తారో ? అన్న అంశం పశుసంవర్ధక శాఖ వర్గాల్లో టెన్షన్ పుట్టిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×