E-Paper
Advertisement

Shamshabad women murder case : హైదరాబాద్ లో మరో దారుణం.. దిశ తరహా ఘటన..

Shamshabad women murder case : హైదరాబాద్ లో మరో దారుణం.. దిశ తరహా ఘటన..
Advertisement
Shamshabad women murder case updates

Shamshabad women murder case updates(Hyderabad latest news):

హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. శంషాబాద్‌లో దిశ తరహా ఘటన జరగడం కలకలం రేపుతోంది. 30 ఏళ్ల గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. ఆమెను దుండగులు అతి కిరాతకంగా చంపేశారు. శంషాబాద్‌ పరిధిలోని శ్రీనివాస కాలనీలో ఈ ఘటన జరిగింది. మహిళను చంపేసిన తర్వాత దుండగులు పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. గురువారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

మహిళ మృతదేహం కాలిపోతోందని గురువారం అర్ధరాత్రి తమకు సమాచారం వచ్చిందని శంషాబాద్‌ ఏసీపీ రామ్‌చందర్‌రావు తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లామన్నారు. ఓ మహిళను దుండగులు పెట్రోల్ పోసి తగలబెట్టారని వెల్లడించారు. మహిళను హత్య చేసి తగలబెట్టారా? లేదా సజీవ దహనం చేశారా? అనేది పోస్టుమార్టం రిపోర్ట్ ద్వారా తెలుస్తుందని వివరించారు. మహిళ ఎవరనే వివరాలు సేకరించే పనిలో ఉన్నామన చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు 4 బృందాలు ఏర్పాటు చేశామని ఏసీపీ తెలిపారు.

Advertisement

ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసు పరిశీలించారు. తొండుపల్లిలోని బంకులో ఓ యువకుడు బాటిల్‌ తో పెట్రోల్ కొనుగోలు చేశాడని గుర్తించారు. మహిళను తగులబెట్టిన నిందితుడికి మరో వ్యక్తి సాయం చేశాడని అనుమానిస్తున్నారు. హత్యకు గురైన ఆమె వేరే రాష్ట్రానికి చెందిన మహిళగా భావిస్తున్నారు.

హైదరాబాద్ శివారులో 2019 నవంబర్ 27న జరిగిన దిశ హత్య కేసు పెను సంచలనం సృష్టించింది. ఆమెపై లైంగికదాడి చేసిన తర్వాత నిందితులు హత్య చేశారు. అదే సంవత్సరం డిసెంబర్ 6న నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. హైదరాబాద్ పరిధిలో అనేక హత్యలు జరిగాయి.

Advertisement

తాజాగా జవహర్ నగర్ పరిధిలోని బాలాజీ నగర్ లో ఓ యువతిని ఉన్మాది వివస్త్రను చేశాడు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. హైదరాబాద్ లో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ డీజీపీని ఆదేశించింది. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న భాగ్యనగరంలో ఇలా వరుస ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×