E-Paper
Advertisement

Passenger: చెప్పు పోయిందని పోలీసులకు ఫిర్యాదు.. చివరికి ఏమైందంటే?

Passenger: చెప్పు పోయిందని పోలీసులకు ఫిర్యాదు.. చివరికి ఏమైందంటే?
Advertisement

Passenger: ఇటీవల ఓ మూడో తరగతి బాలుడు టీచర్ తనని కారణం లేకుండా కొట్టిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇటువంటి వింత ఘటనలు పోలీసులకు అప్పుడప్పుడు ఎదురవుతుంటాయి. అయితే వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే పోలీసులకు మాత్రం ఊహించిన అనుభవం ఎదురైంది. అసలు విషయం తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

స్టేషన్ ఘనపూర్‌కు చెందిన ఓ యువకుడు హైదరాబాద్ వెళ్లేందుకు రైల్వే స్టేషన్ వెళ్లాడు. అప్పటికే కాకతీయ ప్యాసింజర్ రైలు కదలడంతో పరుగెత్తుకుంటూ వెళ్లి రైలు ఎక్కాడు. హడావుడిగా రైలు ఎక్కడంతో అతని కాలుకున్న చెప్పు ఒకటి జారి ట్రాక్‌పై పడిపోయింది. ట్రైన్‌ ఆల్రడీ కదలడంతో దిగి తీసుకోలేని పరిస్థితి. ఇక చేసేది ఏమీ లేక అలానే హైదరాబాద్ వెళ్లాడు ఆ యువకుడు.

Advertisement

రూమ్‌కి వెళ్లాక అతడికి ఓ ఆలోచన వచ్చింది. వెంటనే ట్విట్టర్ వేదికగా రైల్వే పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ట్రైన్ ఎక్కుతుండగా తన చెప్పు జారిపడిపోయిందని.. ఎలాగైనా దాన్ని వెతికి పెట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో కాజీపేట రైల్వే పోలీసులు శనివారం స్టేషన్ ఘన్‌పూర్ స్టేషన్ వద్ద గాలించి ఎట్టకేలకు చెప్పును కనుగొన్నారు. ఆ యువకుడిని పోలీస్ స్టేషన్‌కు పిలుపించుకొని చెప్పును అప్పగించారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×