E-Paper
Advertisement

Boy : వీధి కుక్కలకు మరో బాలుడి బలి.. కాజీపేటలో దారుణం..

Boy : వీధి కుక్కలకు మరో బాలుడి బలి.. కాజీపేటలో దారుణం..
Advertisement

Boy : తెలంగాణలో వీధి కుక్కలకు మరో బాలుడు బలయ్యాడు. హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వేక్వార్టర్స్‌లో 8 ఏళ్ల పసివాడు శునకాల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సునీత, మల్కాన్‌ దంపతులు అజ్మీర్‌ వెళ్లేందుకు తమ కుమారుడు చోటూతో కాజీపేట రైల్వేస్టేషన్‌కు వచ్చారు. వీరు సంచార జాతులవారు. ఆహారం వండుకునేందుకు రైల్వేస్టేషన్‌ పక్కనే ఉన్న పార్కుకు గురువారం రాత్రి వచ్చారు.

శుక్రవారం ఉదయం నిద్ర లేచిన తర్వాత బహిర్భూమికి పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి చోటూ వెళ్లాడు. అక్కడే ఆరు వీధి కుక్కలున్నాయి. ఒక్కసారిగా ఆ కుక్కలు బాలుడిపై దాడి చేశాయి. చెట్టు కొమ్మకు దుస్తులు చిక్కుకోవడంతో చోటూ వాటి నుంచి తప్పించుకోలేపోయాడు. ఎటు కదల్లేక అక్కడే కింద పడిపోయాడు.

Advertisement

దాదాపు 15 నిమిషాలపాటు కుక్కలు బాలుడిపై విచక్షణారహితంగా దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన చోటూ అక్కడికక్కడే మృతిచెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు గుండెలవిసెలా రోదిస్తున్నారు.

రైల్వే క్వార్టర్స్‌లో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు అంటున్నారు. వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. 4 రోజుల క్రితం ఓ బాలికపై కుక్కలు దాడి చేశాయని తెలిపారు. 10 రోజుల క్రితం ఓ రైల్వే ఉద్యోగిపైనా కుక్కలు దాడి చేశాయని అంటున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×