E-Paper
Advertisement

10th Exams: టెన్త్ ఆన్సర్ షీట్స్ మాయం.. ఆందోళనలో విద్యార్థులు

10th Exams: టెన్త్ ఆన్సర్ షీట్స్ మాయం.. ఆందోళనలో విద్యార్థులు
Advertisement

10th Exams: వికారాబాద్‌లో టెన్త్ క్వశ్చన్ పేపర్ లీక్.. ఆదిలాబాద్‌లో జవాబు పత్రాలు మాయం. ప్రస్తుతం ఈ రెండు ఘటనలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. ఫస్ట్ ఎగ్జామ్ రోజే ఉట్నూర్‌లో ఆన్సర్ షీట్స్ మాయం కావడం కలకలం రేపుతోంది.

ఉట్నూర్‌లో మొత్తం 5 సెంటర్లలో విద్యార్థులు టెన్త్ ఎగ్జామ్స్ రాశారు. పరీక్ష అయిపోయాక జవాబు పత్రాలను అధికారులు పోస్ట్ ఆఫీస్‌లో అప్పజెప్పారు. పోస్ట్ సిబ్బంది జవాబు పత్రాలను 11 కట్టలుగా వేరు చేశారు. ఇన్విజిలేషన్ కార్యాలయానికి తరలించేందుకు ఆటోలో బస్టాండ్‌కు తీసుకెళ్లారు. ఈక్రమంలో ఓ ఆన్సర్ షీట్స్ బండిల్ మిస్ అయింది.

Advertisement

వెంటనే పోస్టుమాస్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు పోస్టాఫీస్ నుంచి బస్ స్టేషన్ వరకు గాలించారు. అయినా కూడా ఎక్కడా పేపర్ బండిల్ కనిపించలేదు. దీంతో కేసు నమోదు చేశారు.

ఇక ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే జవాబు పత్రాలు మాయమయ్యాయని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. జవాబు పత్రాలు మాయం కావడంతో నష్టపోయిన విద్యార్థులకు ఎటువంటి పరిష్కార మార్గం చూపిస్తారని నిలదీస్తున్నారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×