E-Paper
Advertisement

Asian Games : జైశ్వాల్ దూకుడు.. సెమీస్ కి మెన్ ఇన్ బ్లూ..

Asian Games  :  జైశ్వాల్ దూకుడు..   సెమీస్ కి మెన్ ఇన్ బ్లూ..
Advertisement
Asian Games 2023

Asian Games : ప్రస్తుతం చైనా నిర్వహణలో జరుగుతున్నటువంటి ఏషియన్ గేమ్స్ లో భాగంగా ఇండియా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో నేపాల్ టీం తో తలపడింది.చైనా , హాంగ్ జౌ వేదికగా జరుగుతున్నటువంటి ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ను ఎంచుకుంది.మొదటినుంచి ఈ మ్యాచ్ లో నిలకడ ప్రదర్శన కనబరిచిన ఇండియన్ ప్లేయర్స్ తమ అద్భుతమైన పర్ఫామెన్స్ తో నేపాల్ టీం ను క్లీన్ బౌల్డ్ చేశారు.

ఈ మ్యాచ్ కచ్చితంగా క్రికెట్ అభిమానులకు కన్నుల పండుగ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కుర్ర ప్లేయర్లు అయినప్పటికీ ప్రత్యర్థులతో చెడుగుడు ఆడారు. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఆరంభాన్ని ఇవ్వడమే కాకుండా మంచి భాగస్వామ్యం తో గట్టి స్కోరే సాధించారు. ఇద్దరూ కలిసి మొదటి వికెట్ పడే సమయానికి 103 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి స్కోర్ బోర్డ్ని పరిగెత్తించారు. గైక్వాడ్ మొదటి నుంచి చాలా నిదానంగా ఆచితూచి ఆడుతుంటే…మరోపక్క జైశ్వాల్ ప్రత్యర్థులపై దూకుడుగా దూసుకుపోయాడు.

Advertisement

23 బంతులకు 25 పరుగులు చేసి హాఫ్ సెంచరీ పై కన్నువేసిన గైక్వాడ్ అనుకోకుండా దీపేంద్ర సింగ్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. అయితే ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ మాత్రం రెండే రెండు పరుగులు చేసి పెవీలియన్ వైపు పరుగులు పెట్టాడు. ఇక ఆ తర్వాత వచ్చిన జితేష్ శర్మ 5 పరుగులకే చేతులెత్తేసాడు. దీంతో మొదట్లో భారత్ మంచి స్కోర్ సాధిస్తుందో .. లేదో…అందరూ టెన్షన్ పడ్డారు. తరువాత క్రేజ్ లోకి దిగిన ప్లేయర్స్ లపై ఎక్కువ ఒత్తిడి పడకుండా జైస్వాల్ ఎంతో కొంత ఆదుకున్నాడు.

తీవ్రమైన ఒత్తిడిలో కూడా పక్కా ప్రణాళికతో తన హిట్టింగ్ పరంపర కొనసాగించాడు. 49 బంతులు ఎదుర్కొని 6 సిక్సులు ,8 ఫోర్లు తో బల్ ను బౌండరీలు దాటించి ..100 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. శివం దూబే ఎదుర్కొన్న 15 బంతులలో 4 సిక్స్ లు 2 ఫోర్లు రాబట్టి 37 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో ఇండియా నిర్ణీత 20 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 202 పరుగులు సాధించింది.

Advertisement

అయితే భారత్ నిర్ణయించిన స్కోర్ చేదించడం కోసం బరిలోకి దిగిన నేపాల టీం భారీగా ఎదురు దెబ్బతింది. పది పరుగులు చేసిన ఆసిఫ్ షేక్ అవుట్ అవ్వడంతో మొదటి వికెట్ భారత్ ఖాతాలో చేరింది. నేపాల్ బ్యాట్స్ మెన్స్ లో ఒక్కళ్ళు కూడా కనీసం ఒక హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయారు. మొన్న జరిగిన మ్యాచ్ లో ఫాస్టెస్ట్ 50 చేసి అందరి దృష్టిని ఆకర్షించిన దీపేంద్ర సింగ్ సైతం 32 పరుగులకే వెనుతిరిగాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయిన నేపాల టీం కేవలం 179 పరుగులు చేయగలిగింది. దీంతో 23 పరుగుల తేడాతో భారత్ నేపాల్ పై ఘన విజయాన్ని నమోదు చేసింది.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×