E-Paper
Advertisement

Ind Vs Eng 2nd Test : జైస్వాల్ డబుల్ సెంచరీ.. టీమిండియా ఆలౌట్..

Ind Vs Eng 2nd Test : జైస్వాల్ డబుల్ సెంచరీ.. టీమిండియా ఆలౌట్..
Advertisement

Ind Vs Eng 2nd Test : విశాఖపట్నం టెస్టులో యశస్వి జైస్వాల్ అద్భుతంగా ఆడాడు. డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. 209 పరుగులు చేసి జట్టు స్కోర్ 383 పరుగుల వద్ద 8వ వికెట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత మరో 13 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయ్యింది. భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్ 396 పరుగుల వద్ద ముగిసింది.

ఓవర్ నైట్ స్కోర్ 336/6తో రెండోరోజు తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన భారత్ తొలుత రవిచంద్రన్ అశ్విన్ (20) వికెట్ ను కోల్పోయింది. 7వ వికెట్ కు జైస్వాల్ , అశ్విన్ 34 పరుగులు జోడించారు. 8వ వికెట్ కు 19 పరుగులు జోడించిన తర్వాత జైస్వాల్ పోరాటం ముగించింది. ఆ తర్వాత మరో 12 పరుగులు జోడించిన తర్వాత బుమ్రా (6) అవుట్ అయ్యాడు. వెంటనే ముఖేశ్ కుమార్ (0) డకౌట్ అయ్యాడు. కులీదీప్ యాదవ్ (8 నాటౌట్) అజేయంగా నిలిచాడు.

Advertisement

ఇంగ్లాండ్ బౌలర్లలో వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 40 ఏళ్లు దాటినా సత్తా చాటుతున్నాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 3 వికెట్లు పడగొట్టాడు. అరంగేట్రం స్పిన్నర్ షోయబ్ బషీర్ 3 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. మరో యువ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ కూడా 3 వికెట్లు పడగొట్టాడు. తొలి టెస్టులో అద్భుతంగా బౌలింగ్ చేసిన టాప్ హర్ట్ లీకి మాత్రం ఒక వికెటే దక్కింది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×