E-Paper
Advertisement

Rohit Sharma Lamborghini : రోహిత్ శర్మ కారు నెంబర్ వెనుక ఉన్న సీక్రెట్ ఇదే.. వాళ్లపై ప్రేమతో

Rohit Sharma Lamborghini : రోహిత్ శర్మ కారు నెంబర్ వెనుక ఉన్న సీక్రెట్ ఇదే.. వాళ్లపై ప్రేమతో
Advertisement

Rohit Sharma Lamborghini : టీమిండియా వన్డే కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. ఇటీవలే ఇంగ్లాండ్ తో టీమిండియా టెస్ట్ సిరీస్ లో భాగంగా 5వ టెస్ట్ ఓవల్ వేదికగా జరిగిన విషయం తెలిసిందే. లండన్  లోని ఓవల్ వేదిక లో జరిగిన 5 టెస్ట్ మ్యాచ్ కి హాజరై.. యశస్వీ జైస్వాల్ సెంచరీ చేయడంతో అతన్ని అభినందించాడు. అలాగే ఆ సమయంలో యశస్వికి సైగలతో ధైర్యం కూడా చెప్పాడు రోహిత్. రెండు నెలలుగా క్రికెట్ కి దూరంగా ఉన్న రోహిత్ ప్రస్తుతం కుటుంబంతో కలిసి వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. కుటుంబంతో కలిసి యూరప్ ట్రిప్ నకు వెళ్లి  స్వదేశానికి తిరిగి వచ్చాడు. అయితే ఇటీవల రోహిత్ శర్మ ఓ లగ్జరీ కారును కొనుగోలు చేయగా. ఆ కారు ముంబైలోని రోహిత్ ఇంటికి తాజాగా డెలివరీ అయింది. ఆ కారు కి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read :  NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

Advertisement

లగ్జరీ కారును కొనుగోలు చేసిన రోహిత్ 

ప్రముఖ ఇటాలియన్ కార్ల తయారి సంస్థ లంబోర్గిని నుంచి ఓ సూపర్ కారును రోహిత్ శర్మ కొనుగోలు చేశాడు. ఆరెంజ్ కలర్ లంబోర్గిని ఉర్సు ఎస్ఈ కారును కోనుగోలు చేశాడు. భారతదేశంలో ఈ కారు ఎక్స్ -షో రూం ధర రూ.4.57 కోట్లు. ముంబైలో దీని ఆన్ రోడ్డు ధర దాదాపు రూ.5.25 కోట్లు. అదేవిధంగా ఈ కారుకు ఉన్న నెంబర్ ప్లేట్ విషయంలో రోహిత్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. కొత్త కారుకు కాస్త కొత్తగా ఆలోచించి 3015 నెంబర్ తీసుకున్నాడు రోహిత్ శర్మ. ఇక ఆ నెంబర్ కి కూడా ఓ ప్రత్యేకత ఉంది.ఆప్రత్యేకత ఏంటంటే..?

Advertisement

కూతురు, కుమారుడి మీద ప్రేమతో

రోహిత్ కూతురు సమైరా డిసెంబర్ 30న జన్మించింది. కొడుకు అహన్ నవంబర్ 15న జన్మించాడు. వీరిద్దరి బర్త్‌డేలు కలిసి వచ్చేలా తన కొత్త కారుకు 3015 నెంబర్ తీసుకున్నాడు. ఇంతకు ముందు కూడా రోహిత్‌ లంబోర్గిని కారు ఉపయోగించాడు. ఆ కారు రిజిస్ట్రేషన్ నెంబర్ 264. వన్డే క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ప్రపంచరికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. ఆ 264 పరుగులకు గుర్తుగా తన కారుకు ఆ నెంబర్ తీసుకున్నాడు. రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్డ్ అయిన తరువాత రోహిత్ శర్మ 2027లో జరుగనున్న వన్డే ప్రపంచ కప్ లో ఆడాలనే కోరికను వ్యక్తం చేశాడు. వారి కోరిక ఫిట్ నెస్ పై ఆధారపడి ఉంటుంది. ఆస్ట్రేలియాలో జరుగనున్న మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చివరిసారిగా కనిపించే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. 2027లో జరుగనున్న వన్డే ప్రపంచ కప్ లో యువతకు అవకకాశం ఇవ్వాలని బీసీసీఐ ప్రణాళికలు చేస్తుంది.

 

Tags

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×