E-Paper
Advertisement

T20 : గ్రూప్-2లో సెమీస్ బెర్త్ ఎవరికి? ఎర్త్ ఎవరికి?

T20 : గ్రూప్-2లో సెమీస్ బెర్త్ ఎవరికి? ఎర్త్ ఎవరికి?
Advertisement

T20 : T20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ పై టీమిండియా ఉత్కంఠభరిత విజయం సాధించి గ్రూప్-2లో అగ్రస్థానానికి చేరినా… సెమీస్ బెర్త్ పై మాత్రం క్లారిటీ రాలేదు. ఎందుకంటే దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌లకు సెమీస్‌ అవకాశాలు సజీవంగా ఉన్నాయి. ఇప్పటికైతే సేఫ్ జోన్ లోనే ఉన్న టీమిండియా… వచ్చే ఆదివారం జింబాబ్వేతో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా సెమీస్ చేరుతుంది. ఒకవేళ జింబాబ్వే చేతిలో ఓడితే… దక్షిణాఫ్రికా, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ల ఫలితాల కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది.

దక్షిణాఫ్రికా మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక రద్దుతో… 5 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ప్రొటీస్‌ ఇంకా పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌తో ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఒక్కదానిలో గెలిచినా ఏడు పాయింట్లతో సౌతాఫ్రికా సెమీస్‌కు వెళ్తుంది. ఒకవేళ రెండింట్లోనూ ఓడితే… ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడక తప్పదు. ఇక టీమిండియా చేతిలో ఓడిపోయి గ్రూప్-2లో మూడో స్థానంలో ఉంది… బంగ్లాదేశ్‌. తన చివరి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పాకిస్తాన్‌పై గెలిస్తే సెమీస్‌ అవకాశాలు ఉంటాయి. అది కూడా ఇతర జట్ల మ్యాచ్ ఫలితాలపై ఆధారపడాలి. అదే పాక్‌ గెలిస్తే మాత్రం బంగ్లాదేశ్ టోర్నీ నుంచి వైదొలగనుంది.

Advertisement

ఇక భారత్, జింబాబ్వే చేతుల్లో అనూహ్యంగా ఓడిన పాకిస్థాన్… నెదర్లాండ్స్‌పై కష్టపడి గెలిచింది. చివరి రెండు మ్యాచ్‌లు దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లతో ఆడనుంది. ఈ రెండింటిలో గెలిస్తేనే పాక్‌ సెమీస్‌ ఆశలు సజీవంగా ఉంటాయి. ఒక్క మ్యాచ్‌లో ఓడినా ఇంటిదారి పట్టాల్సిందే. ఇక జింబాబ్వే, నెదర్లాండ్స్‌ జట్లకు సెమీస్ అవకాశాలు పెద్దగా లేవు. కానీ… భారత్ పై జింబాబ్వే, దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్ గెలిస్తే… భారత్, పాక్ సెమీస్ సమీకరణలు మారిపోయే ఛాన్స్ ఉంది. మొత్తమ్మీద… సూపర్-12 చివరి లీగ్ మ్యాచ్… వచ్చే ఆదివారం, అది కూడా భారత్-జింబాబ్వే మధ్య కావడంతో… ఏయే జట్లు సెమీస్ చేరతాయోనని అప్పటిదాకా ఉత్కంఠగా ఎదురుచూడాల్సిందే.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×