E-Paper
Advertisement

India Vs West Indies : చివరి టీ20లో టీమిండియా ఓటమి.. సిరీస్ విండీస్ కైవసం..

India Vs West Indies : చివరి టీ20లో టీమిండియా ఓటమి..  సిరీస్ విండీస్ కైవసం..
Advertisement

India Vs West Indies : కీలక మ్యాచ్ లో టీమిండియా చేతులెత్తేసింది. బ్యాటర్లు సత్తా చాటలేదు. బౌలర్లు చెలరేగలేదు. దీంతో చివరి టీ20లో వెస్టండీస్ సునాయాసంగా విజయం సాధించింది. 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ను 3-2 తేడాతో కైవసం చేసుకుంది.

ఆఖరి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. సూర్య (61, 45 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులు) చెలరేగి ఆడాడు. తిలక్ వర్మ (27) మరోసారి దూకుడుగా ఆడాడు. మిగతా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. గత మ్యాచ్ లో హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన ఓపెనర్లు యశస్వి జైశ్వాల్ (5), శుభ్ మన్ గిల్ ( 9) ఆరంభంలోనే అవుటయ్యారు. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (14), సంజు శాంసన్ (13) విఫలమయ్యారు. దీంతో భారత్ భారీ స్కోర్ చేయలేకపోయింది. విండీస్ బౌలర్లలో రోమారియో షెఫర్డ్ 4 వికెట్లు పడగొట్టాడు. అకీల్ హోసెన్ , జేసన్ హోల్డర్ రెండేసి వికెట్లు, రోస్టన్ ఛేజ్ ఒక వికెట్ తీశారు.

Advertisement

166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ రెండో ఓవర్ లో మేయర్స్ (10) వికెట్ ను కోల్పోయింది. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పూరన్ కు ఆదిలోనే లైఫ్ లభించింది. హార్ధిక్ బౌలింగ్ లో ముఖేశ్ కుమార్ క్యాచ్ వదిలేశాడు. ఆ తర్వాత రెండు బంతులకు వరుసగా సిక్సులు కొట్టి పూరన్ టచ్ లో కి వచ్చాడు. ఇక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది.

ఓపెనర్ బ్రండన్ కింగ్ (85 నాటౌట్, 55 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సులు), పూరన్ (47, 35 బంతుల్లో ఫోర్, 4 సిక్సులు ) రెండో వికెట్ కు 107 పరుగులు జోడించి విండీస్ విజయానికి బాటలు వేశారు. పూరన్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన షై హోప్ ( 22 నాటౌట్ , 13 బంతుల్లో ఫోర్, సిక్సు) విండీస్ ను విజయ తీరాలకు చేర్చాడు. మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే విండీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్, తిలక్ వర్మ తలో వికెట్ పడగొట్టారు. విండీస్ బౌలర్ షెఫర్డ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు, సిరీస్ లో మొత్తం 176 పరుగులు చేసిన పూరన్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కాయి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×