E-Paper
Advertisement

Virat Kohli: కోహ్లీ ట్వీట్‌పై వివాదం.. డ‌బ్బుల మ‌నిషి అంటూ ఫ్యాన్స్ తిరుగుబాటు !

Virat Kohli: కోహ్లీ ట్వీట్‌పై వివాదం.. డ‌బ్బుల మ‌నిషి అంటూ ఫ్యాన్స్ తిరుగుబాటు !
Advertisement

Virat Kohli:  టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా చేసిన ట్వీట్ వివాదానికి తెరలేపింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్ లో ఉన్న విరాట్ కోహ్లీ ఇవాళ ఉదయం సంచలన పోస్ట్ పెట్టాడు. పోరాటాన్ని ఆపినప్పుడే ఓడిపోయినట్లు.. కానీ తాను పోరాటం ఆపేది లేదన్న రేంజ్ లో ట్విట్ చేశాడు విరాట్ కోహ్లీ. దీంతో ఆయన అభిమానులు తెగ సంబరపడిపోయారు. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు విరాట్ కోహ్లీ ఆడతాడని, అందుకే ఈ పోస్ట్ పెట్టాడని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేశారు. అయితే ఈ పోస్ట్ పెట్టిన గంటలోపే అసలు విషయం తేలిపోయింది. విరాట్ కోహ్లీ పై సొంత అభిమానులే తిరుగుబాటుకు తెర లేపారు.

Also Read: IND VS AUS: గంభీర్ కు చెప్ప‌కుండానే ఆస్ట్రేలియాకు బ‌య‌లుదేరిన‌ రోహిత్, కోహ్లీ…సిరీస్ షెడ్యూల్ ఇదే

విరాట్ కోహ్లీ పై తిరుగుబాటు చేసిన ఫ్యాన్స్

Advertisement

పోరాటాన్ని ఆపినప్పుడే ఓడిపోయినట్లు అని విరాట్ కోహ్లీ పోస్టు పెట్టడంపై సొంత అభిమానులే విరాట్ కోహ్లీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది వన్డే వరల్డ్ కప్ 2027, రిటైర్మెంట్ తీసుకోకపోవడం పైన కాదని… కేవలం ఒక యాడ్ కోసం విరాట్ కోహ్లీ ఈ ట్వీట్ చేశాడని తేలింది. దీంతో విరాట్ కోహ్లీ అభిమానులు అసంతృప్తికి లోనయ్యారు. తమ అభిమానంతో విరాట్ కోహ్లీ ఆడుకోవడం ఏమాత్రం సమంజసమేనా ? ఇలాంటి పనులు ఎందుకు చేశావు అని నిలదీస్తున్నారు. ఈ ఒక్క ట్వీట్ తో విరాట్ కోహ్లీ కూడా డబ్బుల మనిషి అని తేలిపోయిందని మరి కొంతమంది ఫైర్ అవుతున్నారు. ఇలాంటి ట్వీట్లు ఇకపై చేయకుండా ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే మరి కొంత మంది ఇది యాడ్ పోస్ట్ అని ముందే తెలుసు అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి విరాట్ కోహ్లీ సింగిల్ లైన్ ట్వీట్ ఇవాళ రోజంతా హాట్ టాపిక్ అయింది. కాగా wrogn అనే కంపెనీని ప్రమోట్ చేసేందుకు విరాట్ కోహ్లీ ఈ పోస్ట్ పెట్టాడు. దీంతో అభిమానులు ఫైర్ అవుతున్నారు.

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టూర్ కు సిద్ధమైన కోహ్లీ

టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మరో మూడు రోజుల్లోనే వన్డే సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 19వ తేదీ నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. 3 వన్డేలు టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఆడనున్నాయి. అయితే ఈ సిరీస్ కు విరాట్ కోహ్లీ తో పాటు రోహిత్ శర్మ కూడా సెలెక్ట్ అయ్యారు. ఈ ఇద్దరు ప్లేయర్లు గిల్ కెప్టెన్సీలో ఆడనున్నారు. అయితే ఈ టోర్నమెంట్ పూర్తయిన తర్వాత వన్డేలకు కూడా రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ రిటర్మెంట్ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే t20 లు అలాగే టెస్టులకు ఈ ఇద్దరు క్రికెటర్లు రిటైర్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వన్నెలకు కూడా రిటైర్మెంట్ ఇస్తే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై పలికినట్టే అవుతుంది.

Advertisement

Also Read: Commonwealth Games 2030 : 2030 కామన్‌ వెల్త్ గేమ్స్‌కు భారత్ ఆతిథ్యం..అసలు వీటికి ఆ పేరు ఎలా వ‌చ్చింది

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×