E-Paper
Advertisement

Virat Kohli: గ్రౌండ్ లోనే కోహ్లీకి గుండె నొప్పి.. అసలేమైంది..?

Virat Kohli: గ్రౌండ్ లోనే కోహ్లీకి గుండె నొప్పి.. అసలేమైంది..?
Advertisement

Virat Kohli: ఐపీఎల్ 2025 లో భాగంగా 28వ మ్యాచ్ ఆదివారం రోజు జైపూర్ లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు – రాజస్థాన్ రాయల్స్ మధ్య ఆసక్తికర పోరు జరిగింది. ఈ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు రాజస్థాన్ రాయల్స్ ని 9 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సిబి మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.

 

Advertisement

అనంతరం బెంగుళూరు 18 ఓవర్ లో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది. అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున విరాట్ కోహ్లీ తన టి-20 కెరియర్ లో 100 వ హాఫ్ సెంచరీ సాధించాడు. కాగా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. కోహ్లీ 40 బంతుల్లో 54 పరుగులతో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత.. ఆరోగ్యపరంగా కాస్త అసౌకర్యానికి లోనైనట్లు కనిపించాడు. ఛాతిలో నొప్పి వచ్చినట్లుగా అనిపించడంతో చేత్తో గుండె పట్టుకొని కనిపించాడు విరాట్ కోహ్లీ.

ఈ దృశ్యం చూసిన కోహ్లీ అభిమానులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అంతేకాకుండా వెంటనే విరాట్ కోహ్లీ సంజూ శాంసన్ దగ్గరకు వెళ్లి తన గుండె ఎలా కొట్టుకుంటుందో చెక్ చేయమని అడిగాడు. దీంతో సంజు తన చేతికి ఉన్న గ్లౌజ్ తీసేసి కోహ్లీ గుండె మీద చేయి వేసి విరాట్ కోహ్లీ హార్ట్ బీట్ ను చెక్ చేశాడు. ఆ సమయంలో హార్ట్ బీట్ నార్మల్ గానే ఉందని సంజు శాంసన్ చెప్పడంతో విరాట్ కోహ్లీ కుదుటపడ్డాడు. భగభగా మండే ఎండలో, జైపూర్ సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో 42 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ ఉన్న సమయంలో ఈ సంఘటన జరిగింది.

Advertisement

రెండవ ఇన్నింగ్స్ లోని 15 ఓవర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ సమయంలో కామెంట్రీ బాక్స్ లో ఉన్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ మాట్లాడుతూ.. ” విపరీతమైన ఎండ వేడికి కోహ్లీ డిహైడ్రేషన్ వల్ల ఇలా అయి ఉంటాడు” అని చెప్పుకొచ్చాడు. ఆ వెంటనే ఆర్సిబి టీమ్.. టైమ్ అవుట్ తీసుకొని కోహ్లీకి కాస్త విరామం ఇచ్చింది. ఇక వెంటనే టీం డాక్టర్లు వచ్చి కోహ్లీని చెక్ చేశారు. డ్రింక్స్ ఇచ్చి రీ హైడ్రేట్ చేశారు. దీంతో అదృష్టవశాత్తు విరాట్ కోహ్లీకి పెద్దగా ఏం కాలేదని తేలడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

 

అనంతరం విరాట్ కోహ్లీ మళ్లీ బ్యాటింగ్ కొనసాగించాడు. 54 పరుగులు చేసిన తర్వాత ఇలా ఇబ్బంది పడినట్లు కనిపించిన కోహ్లీ.. ఆ తర్వాత 62 పరుగులతో నాటౌట్ గా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్ లో మొత్తం 74 నిమిషాల పాటు మైదానంలో ఉన్న కోహ్లీ.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఇలా ఎంతో కష్టమైన వాతావరణం లో కూడా కోహ్లీ ఆడిన ఆట తీరును అందరూ మెచ్చుకుంటున్నారు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×