E-Paper
Advertisement

Virat Kohli: శ్రీలంకపై చెలరేగిన కొహ్లీ.. సెంచరీతో సచిన్‌ రికార్డు బ్రేక్..

Virat Kohli: శ్రీలంకపై చెలరేగిన కొహ్లీ.. సెంచరీతో సచిన్‌ రికార్డు బ్రేక్..
Advertisement

Virat Kohli: విరాట్ కొహ్లీ వీరవిహారం చేశాడు. శ్రీలంకపై చెలరేగి ఆడాడు. 80 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. 87 బాల్స్ లో 12 ఫోర్లు, ఒక సిక్స్ తో 113 రన్స్ చేశాడు. రోమిత్ శర్మ (83), శుభ్ మల్ గిల్ (70) సైతం రాణించడంతో టీమిండియా 7 వికెట్ల నష్టానికి 373 పరుగుల భారీ స్కోర్ సాధించింది.

ఫామ్ లో ఉంటే కొహ్లీని అడ్డుకోవడం ఏ బౌలర్ తరం కాదు. ఇదే విషయం మరోసారి నిరూపించాడు. సెంచరీతో సచిన్ రికార్డును దాటేశాడు. శ్రీలంకపై అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా విరాట్ కొహ్లీ‌ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు సచిన్‌, కొహ్లీలు ఎనిమిదేసి సెంచరీలతో సమంగా ఉండగా.. ఇప్పుడు శ్రీలంకపై 9వ సెంచరీ కొట్టి.. సచిన్ ను అధిగమించాడు. శ్రీలంకతో పాటు ఆస్ట్రేలియాపైనా తొమ్మిది సెంచరీలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

Advertisement

మరోవైపు, స్వదేశంలో 20 సెంచరీలతో సచిన్‌తో సమంగా నిలిచాడు విరాట్ కొహ్లి. భారత్ లో సచిన్‌ 164 వన్డేల్లో 20 సెంచరీలు కొట్టగా.. కొహ్లీ మాత్రం కేవలం 102 వన్డేల్లోనే 20 సెంచరీలు బాదేశాడు.

అన్ని ఫార్మాట్లలో కలిపి విరాట్ సెంచరీల సంఖ్య 73కి చేరింది. 27 టెస్టు సెంచరీలు కాగా.. 45 వన్డే శతకాలు ఉన్నాయి. గతేడాది ఆసియా కప్‌లో తొలిసారి టీ20ల్లోనూ సెంచరీ చేశాడు కొహ్లి. 100 సెంచరీలు చేసిన సచిన్‌ తర్వాత.. 73 శతకాలతో అత్యధిక శతకాలతో రెండో స్థానంలో నిలిచాడు విరాట్.

Advertisement

వన్డేల్లో విరాట్ కొహ్లీ 12,584 పరుగులతో ఆరో స్థానంలో ఉన్నాడు. సచిన్‌ 18,426 పరుగులతో హయ్యెస్ట్ స్కోరర్ గా టాప్ లో కొనసాగుతున్నాడు. మరి, సచిన్ రికార్డును కొహ్లీ సాధించేనా!?

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×