E-Paper
Advertisement

Vinesh Phogat enters final: ఫైనల్‌లో వినేశ్ ఫొగాట్.. ఆమె ఉడుంపట్టుకు క్యూబా రెజ్లర్ విలవిల..

Vinesh Phogat enters final: ఫైనల్‌లో వినేశ్ ఫొగాట్.. ఆమె ఉడుంపట్టుకు క్యూబా రెజ్లర్ విలవిల..
Advertisement

Vinesh Phogat enters final: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ మరో పతకం ఖాయమైంది. రెజ్లింగ్‌‌లో భారత్ క్రీడాకారిణి వినేశ్ ఫోగాట్ అదరగొట్టింది. సెమీస్‌లో క్యూబాకు చెందిన గుజ్మన్ లోపేజ్‌పై విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. దీంతో భారత్ ఖాతాలో మరో పతకం ఖాయమైంది.

మంగళవారం రాత్రి జరిగిన 50 కేజీల విభాగంలో భారత్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్- క్యూబాకు చెందిన గుజ్మన్ లోపేజ్‌ మధ్య పోరు సాగింది. ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిన ఫోగాట్, ఆది నుంచి దూకుడుగా ఆడింది. పట్టులో ప్రత్యర్థికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. వినేశ్ కాలును మూడుసార్లు పట్టుకుని పడేయాలని ప్రత్యర్థి ఎత్తులు చిత్తయ్యాయి. కానీ వినేశ్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు.

Advertisement

రిఫరీ 30 సెకన్లపాటు లోపేజ్‌కు ఛాన్స్ ఇచ్చారు. దాన్ని అనుకూలంగా మలచుకుంది వినేశ్. ఆ తర్వాత నుంచి ప్రత్యర్థిపై ఎటాక్ మొదలుపెట్టింది. ప్రత్యర్థి రెండు కాళ్లును పట్టి ఎత్తేసి పడేసింది. దీంతో వినేశ్‌కు నాలుగు పాయింట్లు సాధించింది. చివరి నిమిషమున్నర ప్రత్యర్థికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదామె. చివరకు 5-0 తేడాతో క్యూబాపై విజయం సాధించి భారత అమ్మాయి వినేశ్ ఫోగాట్.

ALSO READ: వాళ్లిద్దరూ అవసరమా?.. గంభీర్ పై నెహ్రా సీరియస్

Advertisement

ఒలింపిక్స్‌లో తొలిసారి ఫైనల్‌కు చేరిన భారత రెజ్లర్‌గా వినేశ్ ఫోగాట్ రికార్డు క్రియేట్ చేసింది. అనేక కారణాలతో దాదాపు ఏడాదిన్నరపాటు ఆటకు దూరమైంది వినేశ్. ఒలింపిక్స్‌లో ఈమెపై పెద్దగా ఎవరికీ అంచనాలు లేవు.

ఆది నుంచి బలమైన ప్రత్యర్థులను ఎత్తి కుదేసింది వినేశ్ ఫోగాట్. తొలి మ్యాచ్ జపాన్‌కు చెందిన సుసాకిని ముప్పుతిప్పలు పెట్టింది. క్వార్టర్స్‌లో మాజీ యూరోపియన్ ఛాంపియన్ లివాచ్‌ను ఓడించింది. ఫైనల్లో అమెరికాకు చెందిన సారా హిల్డర్ బ్రాంట్‌తో వినేశ్ ఫోగాట్ తలపడనుంది.

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×