E-Paper
Advertisement

PSL – ECB: పాకిస్థాన్ ఇజ్జత్ పాయె.. ఇంగ్లాండ్ దెబ్బ ఉరేసుకోవాల్సిందే

PSL – ECB: పాకిస్థాన్ ఇజ్జత్ పాయె.. ఇంగ్లాండ్ దెబ్బ ఉరేసుకోవాల్సిందే
Advertisement

PSL – ECB:  పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు ( Pakistan Cricket Board ) ఎక్కడ చూసినా కష్టాలే కనిపిస్తున్నాయి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో… పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ గవర్నమెంట్ కు పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ను కొనసాగిస్తోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అయితే ఈ పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అసలు ఈ ఈవెంట్ నిర్వహించడానికి… వేదిక దొరకడం లేదు. ఉగ్రవాద దేశమంటూ పాకిస్తాన్ పై కొత్త ముద్ర పడిపోయింది. దీంతో పాకిస్తాన్ ( Pakistan ) దేశాన్ని ఎవరు నమ్మడం లేదు.

 

Advertisement

ఛీ కొట్టిన ఇంగ్లాండ్

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 టోర్నమెంటును ( Pakistan Super League 2025 Tournament) మొదట యూఏఈ లో నిర్వహించాలని అనుకున్నారు. అయితే ఈ ఈవెంట్ నిర్వహించేందుకు మొదట దుబాయ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ తర్వాత… పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 టోర్నమెంటు నిర్వహించడానికి అనుమతులు లేవని తేల్చి చెప్పేసింది. దీంతో పాకిస్తాన్ కు ఊహించని షాక్ తగిలింది. అయితే ఆ తర్వాత ఇంగ్లాండ్ బోర్డును ( ECB ) రిక్వెస్ట్ చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఇప్పటికే ఐపీఎల్ 2025 టోర్నమెంటు (IPL 2025) నిర్వహించడానికి… తాము సిద్ధంగా ఉన్నామని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఎన్ని రోజులైనా.. నిర్వహించుకోండి అని తేల్చి చెప్పేసింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు.

Advertisement

అయితే ఇదే అదునుగా చూసిన పాకిస్తాన్… ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డును అడిగి… చూసింది. ఇంగ్లాండ్ దేశంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 టోర్నమెంట్ నిర్వహిస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తి చేసింది. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తులను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఏమాత్రం పట్టించుకోలేదు. ముఖం మీదే ఛీ కొట్టింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. మీలాంటి దేశపు టోర్నమెంటు తమ దేశంలో నడిస్తే.. పరువు పోతుందని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసిందని తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 టోర్నమెంట్ పై మరోసారి నీలి నీడలు కమ్ముకున్నాయి. ఏ దేశానికి వెళ్లిన ఇదే పరిస్థితి నెలకొంటుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆందోళన చెందుతోంది. ఎలా పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ నిర్వహించాలని.. గాబరా పడిపోతుంది.

చక్రం తిప్పిన ఐసీసీ చైర్మన్ జై షా

దుబాయ్ అలాగే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులు రెండు కూడా పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు ఒప్పుకోవడం లేదు. పోయి గంగలో కలవండి తప్ప తమ దగ్గరికి రాకూడదని రెండు బోర్డులు… పాకిస్తాన్ పరువు తీసాయి. అయితే దీని అంతటికి కారణం అమిత్ షా కుమారుడు ఐసీసీ చైర్మన్ జై షా అంటున్నారు. దుబాయ్ అలాగే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులకు ఐసీసీ చైర్మన్ జై షా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట. అందుకే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ కు అస్సలు ఒప్పుకోవడం లేదు ఈ రెండు దేశాలు.

Tags

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×