E-Paper
Advertisement

IND vs NZ: టీమిండియా గ్రాండ్ విక్టరీ.. కుర్రాళ్లు కుమ్మేశారుపో…

IND vs NZ: టీమిండియా గ్రాండ్ విక్టరీ.. కుర్రాళ్లు కుమ్మేశారుపో…
Advertisement

IND vs NZ: రాయపూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 109 పరుగుల లక్ష్యాన్ని 20.1 ఓవర్లలోనే చేధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది.

లక్ష్యం చిన్నదే కావడంతో భారత ఆటగాళ్లు ఆచితూచి బ్యాటింగ్ చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ 51 పరుగులతో చెలరేగిపోయాడు. శుభ్‌మన్‌గిల్ (40*)తో నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లీ 11, ఇషాన్ కిషన్ 8 పరుగులు చేశారు. కివీస్ ఆటగాడు షిప్లే, శాంటర్న్ చెరో వికెట్ తీశారు. నామమాత్రమైన మూడో వన్డే ఈ నెల 24న ఇండోర్‌లో జరగనుంది.

Advertisement

అంతకుముందు.. టీమిండియా బౌలర్లు చెలరేగిపోయారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌‌కు చుక్కలు చూపించారు. భారత బౌలర్ల ధాటికి కివీస్ ఆటగాళ్లు తట్టుకోలేకపోయారు. 34.3 ఓవర్లలో 108 పరుగులు చేసి కుప్పకూలిపోయారు.

న్యూజిలాండ్ జట్టులో ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. గ్లెన్ ఫిలిప్స్ (36), మైఖేల్ బ్రాస్‌వెల్ (22), మిచెల్ శాంటర్న్ (27) పరుగులు చేశారు. ష‌మీ, సిరాజ్‌కు తోడు ఆల్‌రౌండ‌ర్లు హార్ధిక్ పాండ్యా, శార్ధూల్ ఠాకూర్ వికెట్లు తీయ‌డంతో కివీస్ కష్టాల్లో పడింది. వాషింగ్టన్ సుంద‌ర్ వ‌రుస ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు తీసి కివీస్‌ను దెబ్బ‌కొట్టాడు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×