E-Paper
Advertisement

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

Shoaib Akhtar :  K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది
Advertisement
Shoaib Akhtar : ఆసియా క‌ప్ 2025 మ్యాచ్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ప‌లువురు టీమిండియా-పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్లు ఒక‌రిపై మ‌రొక‌రూ విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. అయితే పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్ షోయ‌బ్ అక్త‌ర్ మాత్రం టీమిండియాకే మ‌ద్ద‌తు ఇచ్చిన‌ట్టు మాట్లాడుతున్నాడు. సెప్టెంబ‌ర్ 14న లీగ్ ద‌శ‌లో పాకిస్తాన్ తో మ్యాచ్ కి ముందు టీమిండియా టీమ్ చాలా బాగుంద‌ని.. దానిని ఢీ కొన‌డం పాకిస్తాన్ కి స‌వాల్ అనే చెప్పాడు. అత‌ను చెప్పిన‌ట్టుగానే ఆ మ్యాచ్ లో అద్భుతంగా ఆడారు టీమిండియా ఆట‌గాళ్లు. మ‌రోవైపు సూప‌ర్ 4 ద‌శ‌లో మాత్రం టీమిండియా పై, అంపైర్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు అక్త‌ర్. ఆసియా క‌ప్ 2025లో టీమిండియా చాలా అద్భుతంగా రాణిస్తుంద‌ని.. ప్ర‌స్తుతం ఉన్న జ‌ట్ల‌లో ఏదైనా బ‌ల‌మైన జ‌ట్టు ఉందంటే అది టీమిండియా గురించే మాట్లాడుకోవాల‌ని పేర్కొన్నాడు అక్త‌ర్. అలాగే పాకిస్తాన్ జ‌ట్టు కూడా బ‌ల‌మైన జ‌ట్టే అని వివ‌రించాడు.

కే.ఎల్. రాహుల్ ఆడ‌క‌పోవ‌డానికి కార‌ణం ఏంటో..?

పాకిస్తాన్ వ‌ర్సెస్ టీమిండియా మ్యాచ్ లో అంపైర్ నిర్ణ‌యం స‌రైంది కాద‌ని.. ఫ‌క‌ర్ జ‌మాన్ ఔట్ కాకుండా ఉంటే క‌చ్చితంగా పాకిస్తాన్ విజ‌యంసాధించేది అని తెలిపాడు. మ‌రోవైపు అంపైర్ నాటౌట్ ప్ర‌క‌టించి ఉండాల్సింది అని అంపైర్ పై త‌న అక్క‌సుని వెల్ల‌గ‌క్కాడు. తాజాగా టీమిండియా కీల‌క ఆట‌గాడు కే.ఎల్. రాహుల్ గురించి షోయ‌బ్ అక్త‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం విశేషం. అస‌లు టీమిండియాలో కే.ఎల్. రాహుల్ ఎందుకు లేడో అర్థం కాలేదు. కే.ఎల్. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ జ‌ట్టు ఇంకా చిత్తు చిత్తుగా ఓడిపోయేది అని చెప్పుకొచ్చాడు అక్త‌ర్. పాక్ మాజీ ఫాస్ట్ బౌల‌ర్ షోయ‌బ్ అక్త‌ర్ కామెంట్స్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Also Read :  IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

ఇండియా-పాక్ అభిమానుల మ‌ధ్య యుద్ధం..

Advertisement

మ‌రోవైపు పాకిస్తాన్ ఆట‌గాళ్లు టీమిండియా ఆట‌గాళ్ల పై రెచ్చిపోవ‌డం.. టీమిండియా ఆట‌గాళ్లు పాకిస్తాన్ ఆట‌గాళ్ల‌కు కౌంట‌ర్లు ఇవ్వ‌డం జ‌రుగుతూనే ఉంది. కేవ‌లం ఆట‌గాళ్లే కాదు.. అభిమానుల మ‌ధ్య కూడా యుద్దం జ‌రుగుతోంది. మొన్న సూప‌ర్ 4 మ్యాచ్ లో ప‌లువురు టీమిండియా-పాకిస్తాన్ అభిమానులు దుబాయ్ స్టేడియంలో మ్యాచ్ జ‌రుగుతుండ‌గానే కొట్టుకున్నారు. మ‌రోవైపు పాకిస్తాన్ లేడీ టీమిండియా స్టార్ బ్యాట‌ర్ అభిషేక్ శ‌ర్మ కి స్టేడియం లోనే ప్ర‌పోజ్ చేసింది. దీంతో అందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయ్యాయి. ఆసియా క‌ప్ 2025లో క్రికెట్ లో హైలెట్స్ ఏమైనా ఉన్నాయంటే.. అది టీమిండియా వ‌ర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో జ‌రిగిన సంఘ‌ట‌న‌లు అనే చెప్ప‌వ‌చ్చు. మ‌రోవైపు టీమిండియా ఆట‌గాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వ‌క‌పోవ‌డంతో పాకిస్తాన్ వివాదం సృష్టించిన విష‌యం విధిత‌మే. మ‌రోవైపు సూప‌ర్ 4 ప‌లువురు ఆట‌గాళ్లు ఇండియా పై యుద్ధ విమానాలు, ఆప‌రేష‌న్ సింధూర్ సంఘ‌ట‌న‌లు గుర్తు చేశారు. అందుకు టీమిండియా అభిమానులు సైతం వారికి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు

Advertisement

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×