E-Paper
Advertisement

Tanveer Ahmed: ఫాతిమా సనా లాగా 15 బంతుల్లో కోహ్లీ 50 ప‌రుగులు చేస్తే, న‌*గ్నంగా తిరుగుతా !

Tanveer Ahmed: ఫాతిమా సనా లాగా 15 బంతుల్లో కోహ్లీ 50 ప‌రుగులు చేస్తే, న‌*గ్నంగా తిరుగుతా !
Advertisement

Tanveer Ahmed:  పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ ఫాతిమా సనా ( Fatima Sana) సరికొత్త చరిత్ర సృష్టించారు. టి20 క్రికెట్లో కేవలం 15 బంతుల్లోనే అర్థ సెంచరీ చేసి, రికార్డు నమోదు చేశారు. ఇప్పటివరకు ఏ మహిళా క్రికెటర్ సాధించని రికార్డును సొంతం చేసుకున్నారు. జింబాబ్వే వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన టి20 మ్యాచ్ సందర్భంగా ఈ రికార్డు ఫాతిమా సనా క్రియేట్ చేశారు. గతంలో రిచా ఘోష్, సోఫీ డివైన్, ఫోబ్ లిచ్ ఫీల్డ్ ముగ్గురు 18 బంతులు అర్థ సెంచరీ నమోదు చేస్తే.. లేటెస్ట్ గా ఫాతిమా సనా మాత్రం 15 బంతుల్లోనే 50 పరుగులు చేసి పాత రికార్డులు బ్రేక్ చేశారు. ఈ క్రమంలో ఫాతిమా సనా పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. అయితే ఫాతిమా సనా నెలకొల్పిన ఈ రికార్డును విరాట్ కోహ్లీ కూడా సాధించాలంటూ సోషల్ మీడియాలో కొంత మంది ట్రోలింగ్ మొదలుపెట్టారు.

Also Read: రాజీవ్ శుక్లా భాగోతం బ‌య‌ట‌పెట్టిన ల‌లిత్ మోడీ…ఐపీఎల్ లో ఛాన్స్ ఇస్తామ‌ని డ‌బ్బులు వ‌సూళ్లు, ప్రైవేట్ వీడియోలు చూపించి !

Advertisement

15 బంతుల్లో ఫాతిమా సనా అర్థ సెంచరీ నమోదు చేయగా.. విరాట్ కోహ్లీని దారుణంగా ట్రోలింగ్ చేశారు పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed ). ఫాతిమా సనా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిందని ప్రశంసించారు. ఒక లేడీ అయి ఉండి 15 బంతులు అర్థ సెంచరీ నమోదు చేయడం మామూలు ముచ్చట కాదన్నారు. ఇలాంటి రికార్డులు మరిన్ని నమోదు చేయాలని దిశా నిర్దేశం చేశారు. పాకిస్తాన్ తరఫున ఆడి ఈ రికార్డు నెలకొల్పినందుకు ఆమెకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు తన్వీర్ అహ్మద్.

ఫాతిమా లాగా 15 బంతులో కోహ్లీ 50 ప‌రుగులు చేస్తే, న‌*గ్నంగా తిరుగుతా

ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీకి (Virat Kohli) ఛాలెంజ్ విసిరారు. ఫాతిమా సనా తరహాలో 15 బంతుల్లోనే విరాట్ కోహ్లీ అర్థ సెంచరీ నమోదు చేయాలని సవాల్ చేశారు. ఒకవేళ తన సవాల్ స్వీకరించి అర్థ సెంచరీ నమోదు చేస్తే.. అర్థనగ్నంగా పాకిస్తాన్ వీధుల్లో తిరుగుతానని శపథం చేశారు తన్వీర్ అహ్మద్. మొన్న 58 బంతులు ఆడిన విరాట్ కోహ్లీ కేవలం సెంచరీ మాత్రమే చేశాడని సెటైర్లు పేల్చారు. అదే 58 బంతుల్లో ఫాతిమా సనా డబుల్ సెంచరీ చేసేదని వ్యాఖ్యానించారు. విరాట్ కోహ్లీ టీ20లకు పనికిరాడు అని మరోసారి పరువు తీశారు తన్వీర్ అహ్మద్. గ‌తంలో 48 బంతులు ఆడిన కోహ్లీ కేవ‌లం 50 ప‌రుగులు చేశాడ‌ని కూడా ప‌రువు తీశారు. అయితే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్లు పేల్చుతున్నారు విరాట్ కోహ్లీ అభిమానులు. ఫాతిమా సనా కాదు.. నీ బౌలింగ్ లోనే విరాట్ కోహ్లీ ఆరు బంతులకు ఆరు బౌండరీలు కొడతారని.. తన్వీర్ అహ్మద్ కు కౌంటర్ ఇస్తున్నారు కోహ్లీ అభిమానులు.

Advertisement

Also Read: జాకబ్ బెథెల్ గోల్డ్ చైన్ దొంగిలించిన RCB ఫ్యాన్స్ ? పాకిస్తాన్ వెధ‌వ‌ల్లాగా త‌యారు అవుతున్నారంటూ ట్రోల్స్!

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×