E-Paper
Advertisement

Usman Tariq: నా బౌలింగ్ త‌ల‌చుకుని అభిషేక్ శ‌ర్మ‌ వ‌ణికిపోయాడు..అందుకే ఆస్ప‌త్రిలో ప‌డ్డాడు

Usman Tariq: నా బౌలింగ్ త‌ల‌చుకుని అభిషేక్ శ‌ర్మ‌ వ‌ణికిపోయాడు..అందుకే ఆస్ప‌త్రిలో ప‌డ్డాడు
Advertisement

Usman Tariq:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో అభిషేక్ శర్మ ( Abhishek Sharma) అనారోగ్యం బారిన పడ్డ సంగతి తెలిసిందే. వైరల్ ఫీవర్ అలాగే కడుపు నొప్పితో అభిషేక్ శర్మ ( Abhishek Sharma Health ) బాధపడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (India vs Pakistan ) మ్యాచ్ కు అభిషేక్ శర్మ ఆడడం కష్టమే అంటున్నారు. ఈ మేరకు నిన్న సూర్యకుమార్ యాదవ్ కూడా హింట్ ఇచ్చారు. అయితే ఈ పరిణామాలను ఉద్దేశించి పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ ( Usman Tariq ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన బౌలింగ్ అంటే భయపడిపోయి, అభిషేక్ శర్మ అనారోగ్యం బారీన పడ్డాడని ఉస్మాన్ తారిక్ హాట్ కామెంట్స్ చేశారు. అందుకే ముందు జాగ్రత్తగా ఆసుపత్రిలో పడ్డాడని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: T20 World Cup 2026: అరుణ్ జైట్లీ స్టేడియం ద‌గ్గ‌ర దారుణం…మిగిలిపోయిన డ్రింక్స్ రీ-యూజ్?, ఇండియా ప‌రువు తీస్తున్నారు క‌ద‌రా

నా బౌలింగ్ త‌ల‌చుకుని అభిషేక్ శ‌ర్మ‌ వ‌ణికిపోయాడు

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న అభిషేక్ శర్మను దారుణంగా ట్రోలింగ్ చేసే ప్రయత్నం చేశాడు దుర్మార్గుడు పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్. తన బౌలింగ్ ఎదుర్కొనే దమ్ము లేక ఆసుపత్రి పాలయ్యాడని అభిషేక్ శర్మ పరువు తీశాడు ఉస్మాన్ తారిక్. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో తన బౌలింగ్ ఎదుర్కోవాలంటే కొన్ని గట్స్ కావాలని వెల్లడించారు. ఆ బలం అభిషేక్ శర్మకు లేదని.. అందుకే అనారోగ్యం బారిన పడ్డాడని చురకలు అంటించారు. తన బౌలింగ్ ఎదుర్కోలేక ఆసుపత్రి పాలయ్యాడని ఎద్దేవా చేశారు పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్. దీంతో ఉస్మాన్ తారిక్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే అతనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు ఇండియన్ ఫ్యాన్స్. పాకిస్తాన్ తో మ్యాచ్ కోసం అభిషేక్ శర్మ లేకుంటే ఏంటి… నీకు కరెక్ట్ మొగుడు ఇషాన్ కిషన్ అంటూ ఘాటుగా విమర్శలు చేస్తున్నారు ఇండియన్ ఫ్యాన్స్.

అభిషేక్ శ‌ర్మ ఆడ‌టం క‌ష్ట‌మే

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. శివరాత్రి రోజున ఫిబ్రవరి 15వ తేదీన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య బిగ్ ఫైట్ జరుగుతుంది. ఈ మ్యాచ్ శ్రీలంకలోని కొలంబో వేదికగా నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ కంటే ముందు ఇండియాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. టీమిడియా డేంజర్ ఆటగాడు అభిషేక్ శర్మ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతడు పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ ఆడేది అనుమానంగా ఉంది. ఈ మేరకు సూర్య కుమార్ యాదవ్ కూడా వెల్లడించారు. పాకిస్తాన్ తో అభిషేక్ శర్మ ఆడేది డౌట్ అని వెల్లడించారు.

Advertisement

అయితే పాకిస్తాన్తో మ్యాచ్ లో అభిషేక్ శర్మ దూరం కాబోతున్న నేపథ్యంలో పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన బౌలింగ్ అంటే భయపడిపోయి ఆసుపత్రి పాలయ్యాడని అభిషేక్ శర్మను ట్రోలింగ్ చేశాడు. అందుకే అనారోగ్యం పాడిన పడి.. పాకిస్తాన్ మ్యాచ్ కు దూరమయ్యాడని ఎద్దేవా చేశాడు ఉస్మాన్ తారిక్. దీంతో ఉస్మాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Gerhard Erasmus Bowling Action: న‌మీబియాలో మ‌రో ఉస్మాన్ తారిక్‌..ఇండియాతో జ‌రిగిన‌ మ్యాచ్ లో ఎరాస్మ‌స్ త్రో బౌలింగ్

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×